భారత్లో కరోనా వైరస్ సామాజిక వ్యాప్తి మొదలైందని ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) పేర్కొంది. దేశంలో కరోనా వేగంగా విస్తరిస్తోంది.. అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
" పరిస్థితి ఏ మాత్రం బాగోలేదు. కేసులు తామరతంపరగా పెరిగిపోతున్నాయి. సగటున రోజుకు 30వేల కొత్త కేసులు వస్తున్నాయి. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలకూ కేసులు విస్తరిస్తున్నాయి"
-డాక్టర్ వి.కె. మొంగా, ఐఎంఏ హాస్పిటల్ బోర్డ్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు
పట్టణాలు, గ్రామాల్లోకి వేగంగా చొచ్చుకుపోతున్న వైరస్ను నియంత్రించటం చాలా కష్టమని అన్నారు మొంగా. రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి అప్రమత్తంగా ఉంటూ కేంద్ర సాయాన్ని తీసుకావాలని చెప్పారు. వైరస్కు కళ్లెం పడాలంటే రెండే మార్గాలున్నాయన్నారు. 'మొదటిద మొత్తం జనాభాలో 70 శాతం మందికి వైరస్ సోకితే సామూహిక వ్యాధి నిరోధక శక్తి వస్తుంది. రెండోది.. టీకాల ద్వారా వ్యాధి నిరోధకత సాధించడం' అని వివరించారు.
ఇదీ చూడండి: దిల్లీ ఎయిమ్స్లో 'కొవాగ్జిన్' మానవ ప్రయోగాలకు అనుమతి