ETV Bharat / bharat

కర్ణాటకలోనూ ఎన్​ఆర్​సీ చేపట్టనున్న ప్రభుత్వం!

author img

By

Published : Oct 3, 2019, 3:34 PM IST

కర్ణాటకలో ఎన్​ఆర్​సీ (జాతీయ పౌర రిజిస్ట్రీ) తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. రాష్ట్ర హోంమంత్రి బసవరాజ్​ బొమ్మై ఈ విషయం వెల్లడించారు.

కర్ణాటకలోనూ ఎన్​ఆర్​సీ చేపట్టనున్న ప్రభుత్వం!

అసోంలో ఎన్​ఆర్​సీ చేపట్టిన కేంద్ర ప్రభుత్వం... దేశవ్యాప్తంగా తెచ్చి తీరతామని స్పష్టం చేసింది. తాజాగా కర్ణాటకలోని భాజపా ప్రభుత్వం రాష్ట్రంలో ఎన్​ఆర్​సీ చేపడతామని ప్రకటించింది. అక్రమ వలసదారులను గుర్తించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర హోం మంత్రి బసవరాజ్​ బొమ్మై తెలిపారు.

"దేశవ్యాప్తంగా ఎన్​ఆర్​సీ చేపడతారంటూ పెద్ద చర్చ నడుస్తోంది. అందులో కర్ణాటక కూడా ముఖ్యమైన రాష్ట్రం. ఇక్కడకు ఎంతోమంది విదేశీయులు వచ్చి స్థిరపడ్డారు. వారి వల్ల ఎన్నో సమస్యలు ఉన్నాయి. దీనికి సంబంధించిన సమాచారాన్ని సేకరిస్తున్నాం. కేంద్ర హోంమంత్రిని సంప్రదించి ముందుకు వెళ్తాం."

- బసవరాజ్​, కర్ణాటక హోంమంత్రి

యావత్​ భారత్​లో ఎన్​ఆర్​సీ చేపట్టితీరతామని, అక్రమ వలసదారులను చట్టపరంగా దేశం నుంచి తరిమికొడతామని ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్​ షా స్పష్టంచేశారు.

ఈ నేపథ్యంలో దేశవ్యాప్త ఎన్​ఆర్​సీ ప్రక్రియపై రెండు చర్చలు జరిగాయని.. కొన్ని రాష్ట్రాలు సుముఖత వ్యక్తం చేశాయని బసవరాజ్​ వెల్లడించారు. రాష్ట్రంలో ఎన్​ఆర్​సీ ప్రక్రియపై వారంలోగా స్పష్టమైన నిర్ణయం తీసుకుంటామన్నారు.

అసోంలో మాత్రమే...

ఇప్పటివరకు అసోంలో మాత్రమే ఎన్​ఆర్​సీ పూర్తయింది. జాతీయ పౌర రిజస్ట్రీ​ తుది జాబితాలో 3 కోట్ల 11లక్షల 21 వేల నాలుగు మందికి చోటు లభించింది. సరైన పత్రాలు సమర్పించని కారణంగా 19 లక్షల 6 వేల 657 మందిని జాబితాలో చేర్చలేదు.

అసోంలో ఎన్​ఆర్​సీ చేపట్టిన కేంద్ర ప్రభుత్వం... దేశవ్యాప్తంగా తెచ్చి తీరతామని స్పష్టం చేసింది. తాజాగా కర్ణాటకలోని భాజపా ప్రభుత్వం రాష్ట్రంలో ఎన్​ఆర్​సీ చేపడతామని ప్రకటించింది. అక్రమ వలసదారులను గుర్తించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర హోం మంత్రి బసవరాజ్​ బొమ్మై తెలిపారు.

"దేశవ్యాప్తంగా ఎన్​ఆర్​సీ చేపడతారంటూ పెద్ద చర్చ నడుస్తోంది. అందులో కర్ణాటక కూడా ముఖ్యమైన రాష్ట్రం. ఇక్కడకు ఎంతోమంది విదేశీయులు వచ్చి స్థిరపడ్డారు. వారి వల్ల ఎన్నో సమస్యలు ఉన్నాయి. దీనికి సంబంధించిన సమాచారాన్ని సేకరిస్తున్నాం. కేంద్ర హోంమంత్రిని సంప్రదించి ముందుకు వెళ్తాం."

- బసవరాజ్​, కర్ణాటక హోంమంత్రి

యావత్​ భారత్​లో ఎన్​ఆర్​సీ చేపట్టితీరతామని, అక్రమ వలసదారులను చట్టపరంగా దేశం నుంచి తరిమికొడతామని ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్​ షా స్పష్టంచేశారు.

ఈ నేపథ్యంలో దేశవ్యాప్త ఎన్​ఆర్​సీ ప్రక్రియపై రెండు చర్చలు జరిగాయని.. కొన్ని రాష్ట్రాలు సుముఖత వ్యక్తం చేశాయని బసవరాజ్​ వెల్లడించారు. రాష్ట్రంలో ఎన్​ఆర్​సీ ప్రక్రియపై వారంలోగా స్పష్టమైన నిర్ణయం తీసుకుంటామన్నారు.

అసోంలో మాత్రమే...

ఇప్పటివరకు అసోంలో మాత్రమే ఎన్​ఆర్​సీ పూర్తయింది. జాతీయ పౌర రిజస్ట్రీ​ తుది జాబితాలో 3 కోట్ల 11లక్షల 21 వేల నాలుగు మందికి చోటు లభించింది. సరైన పత్రాలు సమర్పించని కారణంగా 19 లక్షల 6 వేల 657 మందిని జాబితాలో చేర్చలేదు.

Mumbai, Oct 03 (ANI): Shiv Sena leader Aaditya Thackeray held a massive road show ahead his filing of nomination papers for Maharashtra Assembly elections on October 03. He will contest elections from Worli assembly constituency. Hundreds of Thackeray's supporters came to support him during the road show. He began the road show from Shiv Sena office and will end it at the BMC Engineering Hub in Worli where he would file his nomination. Aaditya is the first of his family to contest an election in five decades since his grandfather Bal Thackeray founded the Shiv Sena.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.