ETV Bharat / bharat

'ఆ రాష్ట్రాల్లో అత్యాచారాలపై కాంగ్రెస్​ మౌనమేల?'

author img

By

Published : Oct 24, 2020, 7:07 PM IST

పంజాబ్​ హోషియార్​పుర్​లో జరిగిన ఆరేళ్ల బాలిక అత్యాచార ఘటనపై కాంగ్రెస్ ఎందుకు మౌనం వహిస్తోందని ప్రశ్నించారు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్​. హాథ్రస్​ హత్యాచార ఘటన బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించిన రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ ఇప్పుడేమయ్యారని ధ్వజమెత్తారు.

Punjab rape & murder has 'Bihar angle', Nirmala questions Gandhi siblings silence_Original
హాథ్రస్ వెళ్లిన రాహుల్, ప్రియాంక ఇప్పుడెక్కడ?: నిర్మల

కాంగ్రెస్​పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్​. ఉత్తర్​ప్రదేశ్​ హాథ్రస్​లో దళిత యువతి హత్యాచార ఘటనపై స్పందించిన ఆ పార్టీ నేతలు.. పంజాబ్​లో ఆరేళ్ల బాలికపై అత్యాచారం జరిగితే ఎందుకు మౌనం వహిస్తున్నారని ప్రశ్నించారు. హాథ్రస్​ వెళ్లి బాధిత కుటుంబాన్ని పరామర్శించిన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఇప్పుడు ఏమైపోయారని నిలదీశారు.

" మన మనసుల్ని కలచివేసే విషయం గురించి మాట్లాడుతున్నా. పంజాబ్​ హోషియార్​పుర్​లో బిహార్​కు చెందిన వలస కార్మికుల కుమార్తె, ఆరేళ్ల దళిత బాలికపై అత్యాచారం జరిగింది. శరీరం సగం కాలిపోయింది. ఈ విషయం తెలిశాక కూడా రాహుల్, ప్రియాంక మనస్సాక్షిలో చలనం రావడం లేదా? ఇతర ప్రాంతాల్లో ఇలాంటి ఘటనలు జరిగితే వెెళ్లేవారు ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారు? "

-నిర్మలా సీతారామన్​, కేంద్రమంత్రి.

అత్యాచార ఘటనలను రాజకీయం చేయడం తగదని నొక్కి చెప్పారు నిర్మల. హాథ్రస్​ ఘటన అనంతరం బాధితురాలి కుటుంబాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం పరామర్శించిన రాహుల్, ప్రియాంక.. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పంజాబ్​, రాజస్థాన్​లో అలాంటి ఘటనలు జరిగితే ఎందుకు వెళ్లడం లేదన్నారు.

ఆర్జేడీ నేత, బిహార్​లో మహాకూటమి సీఎం అభ్యర్థి తేజస్వీ యాదవ్​పైనా సీతారామన్ విమర్శలు గుప్పించారు. బిహార్ వలస కార్మిక కుటుంబానికి అన్యాయం జరిగితే స్పందించరా అని ప్రశ్నించారు.

కాంగ్రెస్​పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్​. ఉత్తర్​ప్రదేశ్​ హాథ్రస్​లో దళిత యువతి హత్యాచార ఘటనపై స్పందించిన ఆ పార్టీ నేతలు.. పంజాబ్​లో ఆరేళ్ల బాలికపై అత్యాచారం జరిగితే ఎందుకు మౌనం వహిస్తున్నారని ప్రశ్నించారు. హాథ్రస్​ వెళ్లి బాధిత కుటుంబాన్ని పరామర్శించిన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఇప్పుడు ఏమైపోయారని నిలదీశారు.

" మన మనసుల్ని కలచివేసే విషయం గురించి మాట్లాడుతున్నా. పంజాబ్​ హోషియార్​పుర్​లో బిహార్​కు చెందిన వలస కార్మికుల కుమార్తె, ఆరేళ్ల దళిత బాలికపై అత్యాచారం జరిగింది. శరీరం సగం కాలిపోయింది. ఈ విషయం తెలిశాక కూడా రాహుల్, ప్రియాంక మనస్సాక్షిలో చలనం రావడం లేదా? ఇతర ప్రాంతాల్లో ఇలాంటి ఘటనలు జరిగితే వెెళ్లేవారు ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారు? "

-నిర్మలా సీతారామన్​, కేంద్రమంత్రి.

అత్యాచార ఘటనలను రాజకీయం చేయడం తగదని నొక్కి చెప్పారు నిర్మల. హాథ్రస్​ ఘటన అనంతరం బాధితురాలి కుటుంబాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం పరామర్శించిన రాహుల్, ప్రియాంక.. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పంజాబ్​, రాజస్థాన్​లో అలాంటి ఘటనలు జరిగితే ఎందుకు వెళ్లడం లేదన్నారు.

ఆర్జేడీ నేత, బిహార్​లో మహాకూటమి సీఎం అభ్యర్థి తేజస్వీ యాదవ్​పైనా సీతారామన్ విమర్శలు గుప్పించారు. బిహార్ వలస కార్మిక కుటుంబానికి అన్యాయం జరిగితే స్పందించరా అని ప్రశ్నించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.