సరైన ధ్రువ పత్రాలు చూపకపోవడం వల్ల 8 మంది రోహింగ్యాల్ని.. దిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. వారంతా దిల్లీలోని వివిధ ప్రాంతాలలో అక్రమంగా ఉంటున్నారని పోలీసులు తెలిపారు.
కాగా తూర్పు దిల్లీలో అరెస్టైన ఆరుగురిలో ముగ్గురు మైనర్లు ఉన్నారని పేర్కొన్నారు. ఆనంద్విహార్ రైల్వే స్టేషన్ వద్ద వారిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. వారిని నిర్బంధ క్యాంపులకు తరలించామని వెల్లడించారు.
రోహింగ్యాలుగా అనుమానిస్తున్న ఆరుగురు.. మయన్మార్ నుంచి త్రిపుర ద్వారా దిల్లీకి ఓ రైలులో జనవరి 6న వచ్చినట్లు మాకు సమాచారం అందింది. ఆ ఆరుగరిలో ముగ్గురు మైనర్లు ఉన్నారు. వారిని నిర్బంధ కేంద్రాలకు తరలించాం.
-దీపక్ యాదవ్, డీసీపీ
ద్వారకా జిల్లా ఉత్తమ్ నగర్లో అక్రమంగా ఉంటున్న ఇద్దరు రోహింగ్యాలను శుక్రవారం అరెస్టు చేశామని ఓ సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. వారిపేర్లు హమీద్ హుస్సేన్(23), నబీ హుస్సేన్ అని వెల్లడించారు. ఆ ఇద్దరు నిందితులు నవంబర్1న బంగ్లాదేశ్ సరిహద్దు ద్వారా భారత్లోకి ప్రవేశించారని తెలిపారు. వారివద్ద పాస్పోర్టు, వీసా లేవన్నారు.
ఇదీ చూడండి: మమతపై యూపీ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు