ETV Bharat / bharat

'అయోధ్య తీర్పుపై డిసెంబర్​ 9లోపు సమీక్ష పిటిషన్'

author img

By

Published : Nov 27, 2019, 3:37 PM IST

సుప్రీంకోర్టు 'అయోధ్య' తీర్పుపై డిసెంబర్ 9లోపు సమీక్ష పిటిషన్​ దాఖలు చేయనున్నట్లు అఖిలభారత ముస్లిం పర్సనల్ లా బోర్డు ప్రకటించింది. తమ తరపు న్యాయవాదులను బెదిరిస్తున్న పోలీసులపైనా సర్వోన్నత న్యాయస్థానానికి ఫిర్యాదు చేస్తామని స్పష్టం చేసింది.

Zafaryab Jilani
'అయోధ్య తీర్పుపై డిసెంబర్​ 9లోపు సమీక్ష పిటిషన్'

ఆయోధ్య కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై డిసెంబర్ 9 లోపు రివ్యూ పిటిషన్‌ దాఖలు చేయనున్నట్లు అఖిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్డు ప్రకటించింది. అయితే రివ్యూ పిటిషన్ ఎవరి తరపున, ఎప్పుడు వేస్తామన్న విషయాన్ని మాత్రం ప్రస్తుతం వెల్లడించమని చెప్పింది.

'సున్నీ' ప్రభావం మాపై ఉండదు..

అయోధ్యపై సుప్రీం తీర్పును సవాలు చేయకూడదంటూ సున్నీ సెంట్రల్ వక్ఫ్‌బోర్డు తీసుకున్న నిర్ణయం తమను ప్రభావితం చేయదని బోర్డు కార్యదర్శి జాఫర్‌యాబ్ జిలానీ అన్నారు. సుప్రీంతీర్పుపై సమీక్ష పిటిషన్ దాఖలు చేయాలని నవంబర్ 17న జరిగిన అఖిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్డు సమావేశంలోనే తుది నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పారు. రాజ్యాంగం కల్పించిన హక్కుల మేరకే తాము రివ్యూ పిటిషన్ దాఖలు చేస్తున్నట్లు తెలిపారు. ముస్లిం సంస్థలన్నీ తమవైపే ఉన్నాయని పేర్కొన్నారు.

బెదిరిస్తున్నారు..

సమీక్ష పిటిషన్​ దాఖలు చేస్తే కటకటాలపాలు చేస్తామని అయోధ్య పోలీసులు తమ తరపు న్యాయవాదులను, ముస్లిం పార్టీ (సంస్థలను) బెదిరిస్తున్నారని జిలానీ ఆరోపించారు. ఈ విషయాన్ని సమీక్ష పిటిషన్​లోనూ పేర్కొంటామని ఆయన స్పష్టం చేశారు.

ఇలా ముగిసింది..

దశాబ్దాలగా కొనసాగుతున్న అయోధ్య వివాదంపై సుప్రీంకోర్టు నవంబర్ 9న చారిత్రక తీర్పు వెలువరించింది. వివాదాస్పద స్థలాన్ని రామ్​లల్లాకు అప్పగిస్తూ తీర్పునిచ్చింది. మసీదు నిర్మాణానికి 5 ఎకరాల స్థలం కేటాయించాలని కేంద్రప్రభుత్వాన్ని ఆదేశించింది.

ఇదీ చూడండి: హిమాచల ప్రదేశం... శ్వేతవర్ణ శోభితం

ఆయోధ్య కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై డిసెంబర్ 9 లోపు రివ్యూ పిటిషన్‌ దాఖలు చేయనున్నట్లు అఖిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్డు ప్రకటించింది. అయితే రివ్యూ పిటిషన్ ఎవరి తరపున, ఎప్పుడు వేస్తామన్న విషయాన్ని మాత్రం ప్రస్తుతం వెల్లడించమని చెప్పింది.

'సున్నీ' ప్రభావం మాపై ఉండదు..

అయోధ్యపై సుప్రీం తీర్పును సవాలు చేయకూడదంటూ సున్నీ సెంట్రల్ వక్ఫ్‌బోర్డు తీసుకున్న నిర్ణయం తమను ప్రభావితం చేయదని బోర్డు కార్యదర్శి జాఫర్‌యాబ్ జిలానీ అన్నారు. సుప్రీంతీర్పుపై సమీక్ష పిటిషన్ దాఖలు చేయాలని నవంబర్ 17న జరిగిన అఖిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్డు సమావేశంలోనే తుది నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పారు. రాజ్యాంగం కల్పించిన హక్కుల మేరకే తాము రివ్యూ పిటిషన్ దాఖలు చేస్తున్నట్లు తెలిపారు. ముస్లిం సంస్థలన్నీ తమవైపే ఉన్నాయని పేర్కొన్నారు.

బెదిరిస్తున్నారు..

సమీక్ష పిటిషన్​ దాఖలు చేస్తే కటకటాలపాలు చేస్తామని అయోధ్య పోలీసులు తమ తరపు న్యాయవాదులను, ముస్లిం పార్టీ (సంస్థలను) బెదిరిస్తున్నారని జిలానీ ఆరోపించారు. ఈ విషయాన్ని సమీక్ష పిటిషన్​లోనూ పేర్కొంటామని ఆయన స్పష్టం చేశారు.

ఇలా ముగిసింది..

దశాబ్దాలగా కొనసాగుతున్న అయోధ్య వివాదంపై సుప్రీంకోర్టు నవంబర్ 9న చారిత్రక తీర్పు వెలువరించింది. వివాదాస్పద స్థలాన్ని రామ్​లల్లాకు అప్పగిస్తూ తీర్పునిచ్చింది. మసీదు నిర్మాణానికి 5 ఎకరాల స్థలం కేటాయించాలని కేంద్రప్రభుత్వాన్ని ఆదేశించింది.

ఇదీ చూడండి: హిమాచల ప్రదేశం... శ్వేతవర్ణ శోభితం

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Tottenham Hotspur Stadium, London, England, UK - 26th November 2019.
++++SHOTLIST AND FURTHER INFORMATION TO FOLLOW++++
1. 00:00
2.
3.
4.
5.
6.
7.
8.
9.
10.
SOURCE: SNTV
DURATION: 03:12
STORYLINE:
Dele Alli revealed details of Jose Mourinho's half-time team talk after Tottenham Hotspur came from 2-0 behind to beat 4-2 Olympiacos on Tuesday, and qualify for the Champions League knockout phase.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.