ETV Bharat / bharat

ఏడాదిలో 3 నెలలే పని చేసే పోస్టాఫీస్​ ప్రత్యేకతలెన్నో!

author img

By

Published : Nov 24, 2019, 7:40 AM IST

కేరళలోని ప్రసిద్ధ శబరిమల అయ్యప్ప సన్నిధానంలోని తపాలా కార్యాలయం అది. ఏడాదికి కేవలం మూడు నెలలు మాత్రమే పనిచేస్తుంది. అయ్యప్ప స్వామివారికి వచ్చే లేఖలను దేవస్థానానికి అందిస్తుంది. ఆ పోస్ట్ ఆఫీస్ ప్రత్యేకతలేమిటో మీరే తెలుసుకోండి..

ఏడాదిలో 3 నెలలే పని చేసే పోస్టాఫీస్​ ప్రత్యేకతలెన్నో!
ఏడాదిలో 3 నెలలే పని చేసే పోస్టాఫీస్​ ప్రత్యేకతలెన్నో!

ఏడాదిలో మూడు నెలలు మాత్రమే తెరిచే తపాలా కార్యాలయం అది. అక్కడ ఉపయోగించే తపాలా బిళ్లల్లో స్వామి అయ్యప్ప చిత్రం మాత్రమే ఉంటుంది. అదే కేరళలోని ప్రసిద్ధ శబరిమల అయ్యప్ప సన్నిధానం పోస్టాఫీస్​.

ఏకైక పోస్ట్ ఆఫీస్​

1960లో శబరిమలలోని మాలికప్పురం ఆలయం సమీపంలో ఈ తపాలా కార్యాలయాన్ని ఏర్పాటుచేశారు. ప్రస్తుతం ఇది సబ్​పోస్ట్ ఆఫీస్​గా ఉంది. మండల-మకరవిలక్కు తీర్థయాత్ర జరిగే 66 రోజులు, విషు పండుగ జరిగే పది రోజులు మాత్రమే ఇది పనిచేస్తుంది. దేశంలో ఇలా కేవలం మూడు నెలలు మాత్రమే పనిచేసే ఏకైక తపాలా కార్యాలయం ఇదే.

అయ్యప్ప ముద్రతో..

ఈ తపాలా కార్యాలయంలో 1975 నుంచి అయ్యప్పస్వామి చిత్రంతో తపాలా బిళ్లలను ముద్రిస్తున్నారు. ఈ పోస్ట్ ఆఫీస్​.. వివాహ, నూతన గృహప్రవేశ ఆహ్వానాలు, ధన్యవాద లేఖలు సహా భక్తుల ఆనంద, విషాద లేఖలు అన్నింటినీ స్వీకరిస్తుంది. అలాగే ఈ కార్యాలయానికి అయ్యప్ప పేరిట మనియార్డర్లు వస్తుంటాయి. వీటన్నింటినీ దేవస్థానం కార్యనిర్వాహక అధికారి కార్యాలయానికి అందజేస్తారు.

మొబైల్​ రీఛార్జ్​

ఈ తపాలా కార్యాలయంలో లేఖలు, మనియార్డర్లతో పాటు ఉద్యోగుల జీతాల పంపిణీ, మొబైల్ రీఛార్జ్ సేవలు కూడా అందిస్తారు. అలాగే ప్రజలు కోరుకున్న విధంగా వారి సొంత చిత్రంతో తపాలా బిళ్లను కూడా అందిస్తారు. వీటిలో శబరిమల చిత్రం కూడా ఉంటుంది.

ఈ కార్యాలయంలో పోస్ట్​మాస్టర్, ఇద్దరు పోస్ట్​మెన్, ముగ్గురు గ్రూప్-డీ ఉద్యోగులు సహా మరో ఆరుగురు సిబ్బంది ఉంటారు.

ఇదీ చూడండి: 'ఆ నిర్ణయం నాది కాదు.. సర్కారుకు మా మద్దతు లేదు '

ఏడాదిలో 3 నెలలే పని చేసే పోస్టాఫీస్​ ప్రత్యేకతలెన్నో!

ఏడాదిలో మూడు నెలలు మాత్రమే తెరిచే తపాలా కార్యాలయం అది. అక్కడ ఉపయోగించే తపాలా బిళ్లల్లో స్వామి అయ్యప్ప చిత్రం మాత్రమే ఉంటుంది. అదే కేరళలోని ప్రసిద్ధ శబరిమల అయ్యప్ప సన్నిధానం పోస్టాఫీస్​.

ఏకైక పోస్ట్ ఆఫీస్​

1960లో శబరిమలలోని మాలికప్పురం ఆలయం సమీపంలో ఈ తపాలా కార్యాలయాన్ని ఏర్పాటుచేశారు. ప్రస్తుతం ఇది సబ్​పోస్ట్ ఆఫీస్​గా ఉంది. మండల-మకరవిలక్కు తీర్థయాత్ర జరిగే 66 రోజులు, విషు పండుగ జరిగే పది రోజులు మాత్రమే ఇది పనిచేస్తుంది. దేశంలో ఇలా కేవలం మూడు నెలలు మాత్రమే పనిచేసే ఏకైక తపాలా కార్యాలయం ఇదే.

అయ్యప్ప ముద్రతో..

ఈ తపాలా కార్యాలయంలో 1975 నుంచి అయ్యప్పస్వామి చిత్రంతో తపాలా బిళ్లలను ముద్రిస్తున్నారు. ఈ పోస్ట్ ఆఫీస్​.. వివాహ, నూతన గృహప్రవేశ ఆహ్వానాలు, ధన్యవాద లేఖలు సహా భక్తుల ఆనంద, విషాద లేఖలు అన్నింటినీ స్వీకరిస్తుంది. అలాగే ఈ కార్యాలయానికి అయ్యప్ప పేరిట మనియార్డర్లు వస్తుంటాయి. వీటన్నింటినీ దేవస్థానం కార్యనిర్వాహక అధికారి కార్యాలయానికి అందజేస్తారు.

మొబైల్​ రీఛార్జ్​

ఈ తపాలా కార్యాలయంలో లేఖలు, మనియార్డర్లతో పాటు ఉద్యోగుల జీతాల పంపిణీ, మొబైల్ రీఛార్జ్ సేవలు కూడా అందిస్తారు. అలాగే ప్రజలు కోరుకున్న విధంగా వారి సొంత చిత్రంతో తపాలా బిళ్లను కూడా అందిస్తారు. వీటిలో శబరిమల చిత్రం కూడా ఉంటుంది.

ఈ కార్యాలయంలో పోస్ట్​మాస్టర్, ఇద్దరు పోస్ట్​మెన్, ముగ్గురు గ్రూప్-డీ ఉద్యోగులు సహా మరో ఆరుగురు సిబ్బంది ఉంటారు.

ఇదీ చూడండి: 'ఆ నిర్ణయం నాది కాదు.. సర్కారుకు మా మద్దతు లేదు '

Intro:Body:

A letter to Lord Ayyappa; The special post office in Sabarimala



Sabarimala: A post office that opens only for three months in a year. The postage stamp used here has the image of lord Ayyapa. These are the unique characteristics of Sabarimala Sannidhanam post office. The post office that is situated near Sabarimala Malikappuram temple is the only post office in the country which works in this manner. This post office was opened in Sabarimala in 1960. It is now the Sub Post Office. The seal with the picture of Lord Ayyappa was started from 1975. This postoffice recieves all kind of letters that addresses all the joys and sorrows of the devotees, including wedding invitations, house warming invitations, thanks giving letters etc. There are many money orders that is being send to this postoffice in the name of ayyappa. These are usually handed over to the Devaswom Executive Officer.



This post office operates 66 days during the Mandala-Makaravilakku pilgrimage period and 10 days during Vishu. There are six occupants, including one postmaster, two postmen and three Group D employees. Apart from letters and money orders, the salary of the employees, mobile recharging services can also be done from this post office. This post office also provides personalised stamps in which they can carve their own photo with the image of Sabarimala. 


Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.