ETV Bharat / bharat

వ్యాన్​​- లారీ ఢీ: నలుగురు దుర్మరణం

author img

By

Published : Dec 7, 2020, 10:20 AM IST

Updated : Dec 7, 2020, 11:06 AM IST

రాజస్థాన్​ బిల్​వాడా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వివాహానికి వెళ్లి వస్తున్న వ్యాన్​ను ట్రాలీ లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

accident in rajastan  bilwada  4 people died
వ్యాన్​ను ఢీకొట్టిన ట్రాలీ లారీ -నలుగురు మృతి

రాజస్థాన్​ బిల్​వాడా జిల్లా దేవలీ రహదారిపై వ్యాన్​ను ట్రాలీ లారీ ఢీకొంది. ఆదివారం అర్ధరాత్రి జరిగిన ఈ ఘటనలో నలుగురు మరణించారు. మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో మహిళలు, చిన్నారులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. గాయపడ్డ వారిని జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

ప్రమాద సమయంలో వ్యాన్​లో 15మంది ఉన్నారని పోలీసులు తెలిపారు. వ్యానులో ఇరుక్కున్న మహిళలు, చిన్నారులను అతికష్టం మీద బయటకు తీశామని వివరించారు. ఈ ప్రమాదంతో దేవలీ- బిల్​వాడా రహదారిపై దాదాపు గంట పాటు ట్రాఫిక్​కు అంతరాయం ఏర్పడిందని తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామన్నారు.

రాజస్థాన్​ బిల్​వాడా జిల్లా దేవలీ రహదారిపై వ్యాన్​ను ట్రాలీ లారీ ఢీకొంది. ఆదివారం అర్ధరాత్రి జరిగిన ఈ ఘటనలో నలుగురు మరణించారు. మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో మహిళలు, చిన్నారులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. గాయపడ్డ వారిని జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

ప్రమాద సమయంలో వ్యాన్​లో 15మంది ఉన్నారని పోలీసులు తెలిపారు. వ్యానులో ఇరుక్కున్న మహిళలు, చిన్నారులను అతికష్టం మీద బయటకు తీశామని వివరించారు. ఈ ప్రమాదంతో దేవలీ- బిల్​వాడా రహదారిపై దాదాపు గంట పాటు ట్రాఫిక్​కు అంతరాయం ఏర్పడిందని తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామన్నారు.

ఇదీ చదవండి: ఇకపై మరింత పెద్దగా పొగాకు హెచ్చరికల చిత్రాలు

Last Updated : Dec 7, 2020, 11:06 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.