ETV Bharat / bharat

2020లో 5,100సార్లు పాక్ కాల్పులు

author img

By

Published : Dec 30, 2020, 5:59 AM IST

2020లో పాకిస్థాన్​ 5,100సార్లు కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచింది. దాదాపు 18ఏళ్లల్లో ఇదే అత్యధికం. మరోవైపు 2020లో 203మంది ఉగ్రవాదులను భారత సైన్యం మట్టుబెట్టింది. వీరిలో 166మంది స్థానిక ముష్కరులు ఉన్నారు.

Highest number of ceasefire violations by Pak in 2020 since 2003 truce came into effect: Officials
18ఏళ్లల్లోనే పాక్ అత్యధిక​ కాల్పులు

పాకిస్థాన్​.... 2020లో నియంత్రణ రేఖ వెంబడి 5,100సార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని భద్రతా అధికారులు వెల్లడించారు. ఒప్పందం కుదుర్చుకున్న దాదాపు 18ఏళ్లల్లో ఇదే అత్యధికమని పేర్కొన్నారు.

"ఎల్​ఓసీ, అంతర్జాతీయ సరిహద్దు వెంబడి ఉన్న ఫార్వర్డ్​ పోస్టులు, గ్రామాలను పాకిస్థాన్​ లక్ష్యంగా చేసుకుని కాల్పులకు పాల్పడింది. 2020లో 5,100 సార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. అంటే రోజుకు సగటున 14 కేసులు. ఈ ఘటనల్లో 36మంది మరణించారు. వీరిలో 24మంది భద్రతా సిబ్బంది ఉన్నారు. 130మందికిపైగా గాయపడ్డారు."

--- భద్రతా అధికారులు.

2019లో ఈ సంఖ్య 3,289 అని అధికారులు వెల్లడించారు. వీటిల్లో 1,565 ఘటనలు.. జమ్ముకశ్మీర్​కు స్వయం ప్రతిపత్తిని రద్దు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న అనంతరం జరిగాయని పేర్కొంన్నారు. 2018లో మొత్తం 2,936సార్లు పాక్​ సైన్యం దుశ్చర్యలకు పాల్పడిందని వివరించారు.

భారత్​-పాక్​ మధ్య 2003లో కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. అంతకుముందు 2002లో ఏకంగా 8,376 సార్లు పాకిస్థాన్​ దళాలు.. భారత గ్రామాలపై కాల్పులకు తెగబడ్డాయి.

203మంది ఉగ్రవాదులు...

2020లో 203మంది ఉగ్రవాదులను భారత భద్రతా దళాలు హతమర్చాయి. వీరిలో 166మంది స్థానిక మిలిటెంట్లు ఉండటం గమనార్హం. మరోవైపు 43మంది పౌరులు ప్రాణాలు కోల్పోగా.. మరో 92మంది గాయపడ్డినట్టు అధికార వర్గాల సమాచారం.

వీటితో పాటు 49మంది ఉగ్రవాదులను అధికారులు అరెస్ట్​ చేసినట్టు తెలుస్తోంది.

ఇదీ చూడండి:- దక్షిణ కొరియా పర్యటనలో నరవాణే

పాకిస్థాన్​.... 2020లో నియంత్రణ రేఖ వెంబడి 5,100సార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని భద్రతా అధికారులు వెల్లడించారు. ఒప్పందం కుదుర్చుకున్న దాదాపు 18ఏళ్లల్లో ఇదే అత్యధికమని పేర్కొన్నారు.

"ఎల్​ఓసీ, అంతర్జాతీయ సరిహద్దు వెంబడి ఉన్న ఫార్వర్డ్​ పోస్టులు, గ్రామాలను పాకిస్థాన్​ లక్ష్యంగా చేసుకుని కాల్పులకు పాల్పడింది. 2020లో 5,100 సార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. అంటే రోజుకు సగటున 14 కేసులు. ఈ ఘటనల్లో 36మంది మరణించారు. వీరిలో 24మంది భద్రతా సిబ్బంది ఉన్నారు. 130మందికిపైగా గాయపడ్డారు."

--- భద్రతా అధికారులు.

2019లో ఈ సంఖ్య 3,289 అని అధికారులు వెల్లడించారు. వీటిల్లో 1,565 ఘటనలు.. జమ్ముకశ్మీర్​కు స్వయం ప్రతిపత్తిని రద్దు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న అనంతరం జరిగాయని పేర్కొంన్నారు. 2018లో మొత్తం 2,936సార్లు పాక్​ సైన్యం దుశ్చర్యలకు పాల్పడిందని వివరించారు.

భారత్​-పాక్​ మధ్య 2003లో కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. అంతకుముందు 2002లో ఏకంగా 8,376 సార్లు పాకిస్థాన్​ దళాలు.. భారత గ్రామాలపై కాల్పులకు తెగబడ్డాయి.

203మంది ఉగ్రవాదులు...

2020లో 203మంది ఉగ్రవాదులను భారత భద్రతా దళాలు హతమర్చాయి. వీరిలో 166మంది స్థానిక మిలిటెంట్లు ఉండటం గమనార్హం. మరోవైపు 43మంది పౌరులు ప్రాణాలు కోల్పోగా.. మరో 92మంది గాయపడ్డినట్టు అధికార వర్గాల సమాచారం.

వీటితో పాటు 49మంది ఉగ్రవాదులను అధికారులు అరెస్ట్​ చేసినట్టు తెలుస్తోంది.

ఇదీ చూడండి:- దక్షిణ కొరియా పర్యటనలో నరవాణే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.