శివయ్యకు అభిషేకం.. పులకించిన భక్తజనం - sivaratri celebrations in amadalavalasa

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Feb 21, 2020, 7:23 PM IST

మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీకాకుళంలోని ప్రముఖ శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. రావివలస ఎండల మల్లికార్జున స్వామి ఆలయం, శ్రీముఖలింగం ఆలయాల్లో ఉదయం నుంచే ఆలయాలకు భక్తులు బారులు తీరారు. శ్రీముఖలింగం ఆలయంలో ఎంపీ రామ్మోహన్​నాయుడు దంపతులు ప్రత్యేక పూజలు చేసి అభిషేకాలు నిర్వహించారు. ఆమదాలవలసలోని సరుబుజ్జిలి, పొందూరు మండలాల్లో ఆలయాలు శివనామస్మరణతో మార్మోగాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. జాగరణ సందర్భంగా ఆలయాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు జరగనున్నాయి.

For All Latest Updates

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.