ప్రతిధ్వని: మిషన్ కర్మయోగి - ఈటీవీ భారత్ డిబేట్

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Sep 3, 2020, 9:20 PM IST

దేశ భవిష్యత్ అవసరాలకు తగ్గట్టుగా ఉద్యోగుల సామర్థ్యాన్ని నిరంతరం పెంచడానికి కేంద్ర ప్రభుత్వం.. మిషన్ కర్మయోగి కార్యక్రమానికి శ్రీకారం చుడుతోంది. కేంద్ర ప్రభుత్వంలోని అన్ని స్థాయిల ఉద్యోగుల సామర్థ్యాన్ని పారదర్శకత, సాంకేతికత మేళవింపుతో.. నిర్మాణాత్మకంగా నవ్యావిష్కరణ దిశగా సాన పట్టడమే మిషన్ కర్మయోగి ముఖ్య ఉద్దేశం. ఉద్యోగులంతా దేశాభివృద్ధి కోసం ఒకే దృక్పథంతో ఆలోచించేలా.. ఈ కార్యక్రమంలో శిక్షణ ఇస్తారు. శిక్షణ కార్యక్రమ పర్యవేక్షణకు ప్రధానమంత్రి మానవ వనరుల మండలి పేరిట కొత్త వ్యవస్థను ఏర్పాటు చేస్తారు. ప్రధాని అధ్యక్షతన పనిచేసే ఈ మండలిలో.. కేంద్ర కేబినెట్ మంత్రులు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు, విభిన్న రంగాల దేశ విదేశీ నిపుణులు, సివిల్ సర్వీసుల ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు. ఈ నేపథ్యంలో మిషన్ కర్మయోగి ప్రధాన లక్ష్యాలపై ప్రతిధ్వని చర్చను చేపట్టింది.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.