thumbnail

By

Published : Aug 27, 2020, 5:19 AM IST

Updated : Aug 27, 2020, 5:35 AM IST

ETV Bharat / Videos

ఈటీవీ రజతోత్సవం...ఎమ్​.ఎమ్​ కీరవాణి శుభాకాంక్షలు

ఈటీవీ 25 వసంతాలు పూర్తిచేసుకున్న సందర్భంగా సంగీత దర్శకుడు ఎమ్​.ఎమ్​.కీరవాణి శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు ప్రజల జీవన స్రవంతితో అవినాభావ సంబంధం ఏర్పరుచుకుని ఈటీవీ 25 సంవత్సరాలు పూర్తి చేసుకుందన్నారు. 1995లో ప్రారంభమైన ఈటీవీ... తెలుగులో తొలి ఎంటర్​టైన్​మెంట్ ఛానల్​ అన్నారు. ఈటీవీకి స్వాగత గీతం కంపోజ్ చేసి, పాటను ఎస్పీ బాలుతో పాడించిన సందర్భాన్ని ఆయన గుర్తుచేసుకున్నారు. ఈటీవీ ఎంబ్లమ్‌ తనకు బాగా నచ్చే డిజైన్ అని కీరవాణి అన్నారు. కచ్చితత్వంతో ప్రజల అభిమానాన్ని సంపాదించుకున్న ఈటీవీని మనసారా అభినందిస్తున్నట్లు ఆయన అన్నారు. ఇంకా ఎన్నో సంవత్సరాలు ఎంతో సేవ చేయాలని కోరారు. 25 వసంతాలు పూర్తి చేసుకున్న ఈటీవీకి కీరవాణి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
Last Updated : Aug 27, 2020, 5:35 AM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.