YSRCP Former worker fire on CM Jagan: రాజశేఖర్రెడ్డి బ్రతికుంటే జగన్ పాలన చూసి ఆత్మహత్య చేసుకునేవారు: వైసీపీ మాజీ కార్యకర్త - YSRCP Former worker Neelakantha Reddy news
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/09-10-2023/640-480-19724166-thumbnail-16x9-nilakantam.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 9, 2023, 10:35 PM IST
YSRCP Former worker fire on CM Jagan: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై.. వైఎస్సార్సీపీ మాజీ కార్యకర్త నీలకంఠా రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ను ముఖ్యమంత్రి చేయడానికి తాను ఇళ్లు, ఆస్తులు అమ్మేశానని ఆవేదన వ్యక్తం చేశారు. 40 రోజుల పాటు గడ్డం పెంచుకుని పార్టీ కోసం, జగన్ కోసం కఠోర దీక్ష చేస్తే.. అధికారం చేపట్టాక కాళ్లకు చెప్పులు కొనుక్కునే స్థాయిలో లేకుండా చేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీని గద్దె దించడటమే లక్ష్యంగా ముందుకు సాగుతానని స్పష్టం చేశారు.
Nilakantha Reddy Comments: టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమ అరెస్ట్ను నిరసిస్తూ.. శ్రీ సత్యసాయి జిల్లా సీకెపల్లిలో రెడ్డి సామాజిక వర్గం వారు నిరాహార దీక్షలు నిర్వహించారు. ఈ దీక్షల్లో వెంకటాంపల్లికి చెందిన నీలకంఠా రెడ్డి పాల్గొని చంద్రబాబుకు సంఘీభావం తెలిపారు. ఆయన (నీలకంఠా రెడ్డి) వైఎస్ కుటుంబానికి వీరాభిమాని.. ఈ మధ్యనే టీడీపీలో చేరారు. నీలకంఠా రెడ్డి మాట్లాడుతూ..''జగన్ సీఎం కావాలని నా ఇల్లు రూ.20 లక్షలకు అమ్మి పార్టీ కోసం ఖర్చు చేశాను. వైఎస్ రాజశేఖర్ రెడ్డి లాగానే జగన్ పాలన ఉంటుందని నమ్మి ఓట్లు వేశాం. జగన్ను సీఎం చేయాలంటూ కాంగ్రెస్ కార్యాలయం ఎదుట నిరాహార దీక్షలు చేశాను. 40 రోజులు కఠోర దీక్ష చేసి అనంతపురం నుంచి పులివెందులకు పాదయాత్ర చేశాను. ఇంత చేసినా మాకు ఏ పదువులు, కాంట్రాక్ట్లు ఇవ్వకపోగా.. కనీసం పలకరించనూ లేదు. మేము ఆస్తులు కోల్పోయి, కాళ్లకు చెప్పులు కొనలేని పరిస్థితికి వచ్చాము. కానీ జగన్ రెడ్డి సీఎం అయ్యి కక్ష సాధింపు పాలన చేస్తున్నారు. రాజశేఖర్ రెడ్డి మృతి చెందకుండా ఉండుంటే కచ్చితంగా జగన్ పాలన చూసి ఆత్మహత్య చేసుకునేవారు. జగన్ రెడ్డి దుర్మార్గపు పాలనలో నన్ను నమ్మి ఓట్లేసిన వారికి సమాధానం చెప్పలేకే టీడీపీలో చేరాను'' అని ఆయన అన్నారు.