'ఇదే మా చివరి పాట'.. మరణంలోనూ వీడని స్నేహం.. సరదాగా ఆడిపాడిన కొన్ని నిమిషాలకే..

By

Published : Jun 12, 2023, 3:58 PM IST

thumbnail

ఈ యువకులు మరణంలోనూ తమ స్నేహాన్ని వీడలేదు. కర్ణాటకలో జరిగిన ఘోర ప్రమాదంలో ఘటనా స్థలిలోనే మృతిచెందారు. మరో ఇద్దరు  మృత్యువుతో పోరాడుతున్నారు. ప్రమాదం జరగడానికి కొన్ని నిమిషాల ముందు వారు హుషారుగా పాడిన పాట ఇప్పుడు సోషల్​ మీడియాలో వైరల్​ అవుతోంది. ఈ ఘటన రామనగర జిల్లాలో జరిగింది.  

రామనగరకు చెందిన వినయ్​, విజయ్​, మంజేశ్​, నిఖిల్​ ఓ పని కోసం కారులో మద్దూరు మండలం బెసగరహళ్లికి వెళ్లారు. పని ముగించుకుని రామనగరకు తిరుగు ప్రయాణమయ్యారు. ఈ సందర్భంగా కారులో హుషారుగా పాటలు పాడారు. అందులో భాగంగా కన్నడ సినిమాలోని స్నేహితుల సాంగ్​ 'కుచుకు కుచుకు' అనే పాటను ఉత్సాహంగా పాడుతూ రికార్డ్ చేశారు. చెన్నపట్న మండల కేంద్రం సమీపంలోకి రాగానే.. వారు ప్రయాణిస్తున్న కారు ఘోర ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో వినయ్​, మంజేశ్​ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. తీవ్రంగా గాయపడిన విజయ్​, నిఖిల్​ను ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉంది. వీరు చివరి సారిగా పాడిన పాట ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది.  

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.