సమస్యలు పరిష్కరించే వరకు పోరాడుతూనే ఉంటాం: ఏపీ జేఏసీ అమరావతి నేతలు - ఔట్​ సోర్సింగ్​ ఉద్యోగుల సమస్యలు

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 28, 2023, 6:12 PM IST

Outsourcing Employees Meeting with AP JAC Amaravati Leaders: ఔట్​ సోర్సింగ్​ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని.. ఏపీ జేఏసీ అమరావతి నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్​ చేశారు. అనంతపురంలోని రెవెన్యూ భవన్​లో ఏపీ జేఏసీ అమరావతి నాయకులతో కలిసి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అంతకముందు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించి నినాదాలు చేశారు. ఔట్​ సోర్సింగ్​ ఉద్యోగులు చాలీ చాలనీ వేతనాలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోంటున్నారని ఔట్​ సోర్సింగ్​ ఎంప్లాయిస్ అసోసియేషన్ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. సమాన పనికి సమాన వేతనం అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు. శ్రమకు తగిన వేతనం అందడం లేదన్నారు. ఉద్యోగ భద్రత లేదని.. ప్రభుత్వ పథకాలను తొలగించారని అన్నారు. ఔట్​ సోర్సింగ్​ ఉద్యోగులను శాశ్వత ఉద్యోగులు గుర్తించాలని డిమాండ్​ చేశారు. సమస్యలు పరిష్కరించే వరకు పోరాడుతూనే ఉంటామని హెచ్చరించారు. డిసెంబర్​ 10వ తేదీన విజయవాడలో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నట్లు గుర్తు చేశారు. ఈ సభకు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి హాజరవుతున్నారని తెలిపారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.