నిలువునా ముంచేసిన మిగ్జాం తుపాను - పురుగు మందు తాగి యువ రైతు ఆత్మహత్య - ఏపీ రాజకీయ వార్తలు
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 8, 2023, 8:17 PM IST
Michaung Cyclone Affect Young Farmer Suicide: మిగ్జాం తుపాను యువరైతు ప్రాణాలు తీసుకుంది. గుంటూరు జిల్లా దుగ్గిరాలకు చెందిన రైతు తుల్లిమిల్లి బసవపున్నయ్య 7 ఎకరాలు వరి సాగు చేశారు. 5 ఎకరాలు కౌలుకు తీసుకొని, మరో రెండెకరాలు సొంత పొలంలో వరి వేశారు. పెట్టుబడి కోసం కొంత మొత్తాన్ని అప్పు రూపంలో తీసుకొచ్చారు. ఈ ఏడాది కృష్ణా డెల్టా ప్రాంతంలో నీటి లభ్యత తక్కువగా ఉన్నా మోటార్లతో పంటను బతికించుకున్నారు.
Farmer Suicide e in Guntur District: మరో వారం రోజుల్లో కోతకు సిద్ధమవుతున్న సమయంలో మిగ్జాం తుపాను(Michaung Cyclone) ప్రభావంతో కురిసిన వర్షాలు బసవపున్నయ్యను నిలువునా ముంచేశాయి. ఆయన పంట పొలంలో రెండడుగుల నీటిని చూసి ఒక్కసారిగా చలించిపోయారు. పంట వర్షార్పణం కావడంతో ఈనెల 7వ తేదీన పొలంలోనే పురుగుమందు తాగి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. వెంటనే కుటుంబసభ్యులు అతడిని పొన్నూరు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం ప్రాణాలు కోల్పోయాడు.