thumbnail

అధికార పార్టీ ఆక్రమణ పర్వం - ఓటు వేసినందుకు అన్యాయం చేశారని బాధిత మహిళ ఆవేదన

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 23, 2023, 3:50 PM IST

Land Occupied By Sarpanch: అనకాపల్లి జిల్లా గొలగం పంచాయతీ శివారు కొత్త తలారివానిపాలెంలో వైసీపీ సర్పంచ్‌ తమ స్థలాన్ని కబ్జా చేసి అక్రమంగా నిర్మాణం చేపడుతున్నారని ఎస్సీ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. కులం పేరుతో తమను దూషిస్తున్నారని బాధితురాలు శాంతి కుమారి వాపోయారు. 1991లో సర్వేనెంబర్ 283లో దళితులు సాగు చేసుకోవడానికి ముగ్గురికి మూడు ఎకరాల స్థలాన్ని ప్రభుత్వం కేటాయించిందని తెలిపారు. 

శాంతి కుమారికి తెలిపిన వివరాల ప్రకారం గతంలో బాధితురాలికి చెందిన అర్ధ ఎకరంలో ప్రభుత్వం రైతు భరోసా, హెల్త్‌ వెల్‌నెస్‌ సెంటర్‌ను నిర్మించింది. అప్పట్లో ఆ నిర్మాణాలను అడ్డుకోగా నష్టపరిహారం రాదు అని అధికారులు తెలిపి, మిగిలిన స్థలంలో ఇల్లు నిర్మించుకోవాలని సూచించారు. అయితే అందులోని ఐదు సెంట్ల స్థలానికి ఎల్​పీసీ (Land Posession Certificate) సృష్టించి వైసీపీ సర్పంచ్‌ అక్రమ నిర్మాణం చేస్తున్నారని శాంతికుమారి ఆవేదన వ్యక్తం చేశారు. ఓటేసి గెలిపించినందుకు సర్పంచ్  అన్యాయం చేశారని బాధితురాలు వాపోయారు. అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందించడం లేదని, తనకు న్యాయం చేయాలని బాధితురాలు వేడుకుంటున్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.