thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 24, 2023, 10:37 AM IST

ETV Bharat / Videos

ఉత్తరాంధ్రని విధ్వంసం చేసిన జగన్‌ దొడ్డిదారిన విశాఖకు మకాం మారుస్తున్నారు: లక్ష్మీనారాయణ

Lakshminarayana Allegations on Jagan Moving Administration to Visakha: క్యాంప్ ఆఫీసుల ముసుగులో.. పాలనను విశాఖకు తరలించేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయటం గర్హనీయమని ఆంధ్రప్రదేశ్ సమగ్ర అభివృద్ధి అధ్యయన వేదిక కన్వీనర్ టి.లక్ష్మీనారాయణ అన్నారు. జగన్ ప్రభుత్వానికి ఉన్నత న్యాయ స్థానాల తీర్పులపై గౌరవం ఉంటే ఈ తరహా దుశ్చర్యకు పాల్పడి ఉండేది కాదని అన్నారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడానికి, ఉత్తరాంధ్ర ప్రజలను దగా చేయడానికే ఈ ఉత్తర్వులు జారీ చేశారని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్ర జిల్లాలలో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల సమీక్ష, పర్యవేక్షణ కోసం విశాఖపట్నంలో రాత్రిపూట బస చేయటం ఎందుకని ఆయన ప్రశ్నించారు. 

విభజన చట్టం కింద హక్కుగా రావాల్సిన రాయలసీమ- ఉత్తరాంధ్ర అభివృద్ధి నిధుల మాట ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. రైల్వే జోన్​కు రాష్ట్ర ప్రభుత్వమే భూమి కేటాయించలేదని తెలుస్తోందని ఆయన ఎద్దేవా చేశారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం చేపట్టలేదని విమర్శించారు. నాలుగున్నరేళ్లలో ఉత్తరాంధ్రలోని నీటి ప్రాజెక్టుల నిర్మాణం కోసం 500 కోట్లు కూడా ఖర్చు చేయలేదని లక్ష్మీనారాయణ వ్యాఖ్యానించారు. మరి ఏ అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష చేయడానికి విశాఖలో క్యాంపు ఆఫీసులు ఏర్పాటు చేస్తున్నారో సీఎం రాష్ట్రప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.