Irrigation Minister Ambati Rambabu on Water: నీరు ఇవ్వలేం.. వర్షాధార పంటలు వేసుకోవాలని రైతులకు చెప్పాం: అంబటి - water shortage for farming in ap
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/08-10-2023/640-480-19711261-thumbnail-16x9-irrigation-minister-ambati-rambabu-on-water.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 8, 2023, 10:13 AM IST
Irrigation Minister Ambati Rambabu on Water: వర్షాభావ పరిస్థితుల కారణంగా ఈసారి కృష్ణా డెల్టా, రాయలసీమ ప్రాంతాల్లో సాగునీరు ఇవ్వలేమని జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు స్పష్టం చేశారు. ఈ సంవత్సరం నీటి నిలువలు సరిగా లేవని.. దీనిపై ఇప్పటికే రైతులకు సమాచారం సైతం ఇచ్చామని మంత్రి అంబటి అన్నారు. వర్షాలు సరిగా లేక.. జలాశయాలు ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు. ప్రస్తుతానికి పులిచింతల ప్రాజెక్టులో కొంతమేర నీటి నిల్వ ఉందని.. అదే విధంగా కృష్ణా డెల్టాకు సంబంధించి రైతులకు సమృద్ధిగా నీటిని ఇవ్వగలమని అన్నారు.
ఇకపోతే.. నాగార్జున సాగర్ కుడి కాలువకు సంబంధించి.. ఆరుతడి పంటలు కూడా వద్దని చెప్పామని.. కేవలం వర్షాధార పంటలు మాత్రమే వేసుకోవాలని చెప్పామని పేర్కొన్నారు. చెరువులకు నీటిని విడుదల చేస్తున్నామని తెలిపారు. కృష్ణా నదీ యాజమాన్య బోర్డు కేటాయించిన 45 TMCల నుంచి 5 TMCల నీటిని తాగునీటి అవసరాల కోసం విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. పరిస్థితి దారుణంగా ఉందని చెప్పారు.