అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు - చంద్రబాబు బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా - Chandrababu anticipatory bail
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 1, 2023, 9:14 PM IST
High Court Adjourned Hearing on Chandrababu Bail Petition: అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ టీడీపీ అధినేత నారా చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు విచారణ జరిపింది. ఈ కేసులో ఇప్పటికే చంద్రబాబు తరపు సీనియర్ న్యాయవాది నాగముత్తు వాదనలు వినిపించారు. సీఐడి తరపున అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ వాదనలు వినిపించారు. వాదనలు కొనసాగింపునకు ఈ నెల 6వ తేదీకి న్యాయస్థానం వాయిదా వేసింది. అప్పటి వరకు పిటిషనర్పై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు కొనసాగుతాయని తెలిపింది.
మరోవైపు చంద్రబాబును కస్టడీకి ఇవ్వాలని కోరుతూ విజయవాడ ఏసీబీ కోర్టులో సీఐడి గతంలో దాఖలు చేసిన పీటీ వారెంట్ పిటిషన్ను నేడు మరోసారి విచారణ జరిపింది. తదుపరి విచారణ ఈ నెల 5వ తేదీకి వాయిదా వేసింది. ఇప్పటికే ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ను సుప్రీంకోర్టు విచారణ జరిపి డిసెంబరు 12వ తేదీకి వాయిదా వేసిన సంగతి తెలిసిందే.