వెల్డింగ్​ చేస్తుండగా బోటులో అగ్ని ప్రమాదం

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 6, 2024, 4:11 PM IST

thumbnail

Fire Accident in The Boat While Welding in Yanam : కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలోని ఓ బోటులో అగ్ని ప్రమాద ఘటన  చోటు చేసుకుంది. కాకినాడ జిల్లాలోని అంతర్భాగంగా ఉన్న దరియాతిప్ప గోదావరి ఒడ్డున ఓ బోటులో అగ్ని ప్రమాదం చోటుచోసుకుంది. మేకనైజ్డ్​ బోటులో వెల్డింగ్​ చేస్తుండగా ఒకసారిగా మంటలు చెలరేగాయి. దీంతో బోటు పూర్తిగా దగ్దమైంది. స్థానికులు యానం అగ్నిమాపక సిబ్బంది సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు.

Fire Department Officers Controlled The Fire : బోటు నుంచి ఎగిసి పడుతున్న మంటలను అగ్నిమాపక అధికారులు అదుపు చేశారు. ఈ బోటు కోనసీమ జిల్లా ఐ. పోలవరం బైరవపాలెంకు చెందిన వారిదిగా పోలీసులు గుర్తించారు. ప్రమాద ఘటనపై  కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడతామని పోలీసులు తెలిపారు. అనంతరం పోలీసులు బోటు యాజమానికి సమాచారం అందించారు. దీంతో దగ్ధమైన బోటు చూసి యాజమాని లబోదిబోమన్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.