భూవివాదం - మహిళా రైతు Vs రెవెన్యూ సిబ్బంది

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 4, 2023, 8:35 PM IST

thumbnail

Fight Between Woman Farmer and Revenue Staff:  శ్రీ సత్యసాయి జిల్లా గాండ్లపెంట తహసీల్దార్ కార్యాలయంలో మహిళా రైతు, రెవెన్యూ సిబ్బంది మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఓ దశలో రైతు, అధికారులు పరస్పరం దాడి చేసుకునేందుకు ప్రయత్నించడంతో తహసీల్దార్ కార్యాలయంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వివరాల్లోకి వెళ్తే, కదిరికి చెందిన రైతు శోభారాణి గాండ్లపెంట మండలం వేపరాల వద్ద వ్యవసాయ భూమి కొనుగోలు చేశారు. తాను కొన్న భూమిలోకి  వెళ్లే దారి చూపాలంటూ సర్వే కోసం దరఖాస్తు చేసుకున్నారు. మూడు నెలల నుంచి సర్వే చేయాలని కోరుతున్నా సిబ్బంది వాయిదా వేస్తూ వస్తున్నారు. 

ఈ విషయమై తహసీల్దార్  హమీద్ భాషా, అర్ఐ మున్వర్ బాషా ను అడిగేందుకు కార్యాలయానికి వెళ్లారు. ఈ నేపథ్యంలో రైతు శోభారాణి, అధికారులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. మాటమాట పెరగడంతో  పరస్పరం దాడి చేసుకునేందుకు ప్రయత్నించారు. తహసీల్దార్ కార్యాలయంలో గొడవ జరుగుతున్న విషయాన్ని పోలీసులకు చేరవేశారు. అక్కడికి చేరుకున్న పోలీసులు ఇరువర్గాలకు సర్ది చెప్పారు. మహిళా రైతును అక్కడి నుంచి పంపించి వేయడంతో గొడవ సద్దుమణిగింది.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.