టీటీడీ నిధుల మళ్లింపును సవాల్ చేస్తూ హైకోర్టులో పిల్ - తిరుపతి జిల్లా లేటెస్ట్ న్యూస్
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 8, 2023, 4:04 PM IST
Bhanuprakash Reddy Pill in HC on TTD Funds Diversion: తిరుమల తిరుపతి దేవస్థానం నిధులు మళ్లింపును సవాల్ చేస్తూ టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు, బీజేపీ (BJP) రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాశ్ రెడ్డి హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. టీటీడీ నిధులు తిరుపతి కార్పొరేషన్ రోడ్లు, పారిశుద్ధ్యానికి కేటాయించడం చట్ట విరుద్ధమని పిటిషన్లో పేర్కొన్నారు. ఎండోమెంట్ చట్టం 111 ప్రకారం నిధులు మళ్లింపు చట్ట విరుద్ధమని పిటిషనర్ తరఫు న్యాయవాది యలమంజుల బాలాజీ పిటిషన్ దాఖలు చేశారు. టీటీడీ నిధులు తిరుమల తిరుపతి దేవస్థానం అభివృద్ధికి మాత్రమే వినియోగించాలని పిటిషన్లో న్యాయవాది బాలాజీ కోరారు.
BJP Leader Bhanuprakash Fire on YCP Govt: తిరుమల (Tirumala) శ్రీవారి నిధులను హారతి కర్పూరంలా కరిగించేందుకు వైసీపీ ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని భానుప్రకాష్ రెడ్డి ఆరోపించారు. తిరుపతిలో మీడియా సమావేశంలో ఇటీవల మాట్లాడిన ఆయన ఈ మేరకు వ్యాఖ్యానించారు. టీటీడీ నిధులను తిరుపతి కార్పొరేషన్కు మళ్లించే ప్రయత్నాన్ని ఆయన తప్పుపట్టారు. ధార్మిక చట్టానికి విరుద్ధంగా ధర్మకర్తల మండలి నిర్ణయం తీసుకోవడం సరైనది కాదని అన్నారు.