ఐదో తేదీ వచ్చినా ప్రభుత్వ ఉద్యోగులకు ఇంకా జీతాలు రాలేదు : ఏపీటీఎఫ్ - ఏపీటీఎఫ్ న్యూస్
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/05-11-2023/640-480-19948489-thumbnail-16x9-aptf-president-hrudaya-raju.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 5, 2023, 3:27 PM IST
APTF President Hrudaya Raju: ఐదో తారీకు వచ్చినా ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు, పెన్షన్లు చెల్లించకపోవడం దురదృష్టకరమని ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు హృదయ రాజు అన్నారు. గత నాలుగేళ్లుగా రాష్ట్రంలో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా... ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. సీపీఎస్ (CPS) రద్దు చేస్తానన్న సీఎం జగన్ కొత్త విధానాలతో ఉద్యోగుల పట్ల వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారన్నారు.. కారుణ్య నియామకాలు భర్తీ చేయకుండా ఉద్యోగుల కుటుంబాలను ఇబ్బంది పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పెన్షన్లతో దేశ ఆర్థిక వ్యవస్థకు భారం అవుతుందని జయప్రకాష్ నారాయణ వ్యాఖ్యలను హృదయరాజు ఖండించారు.
విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ ప్రవీణ్ ప్రకాష్ ఉద్యోగుల పట్ల వ్యవహరించే తీరు సరికాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వ లోపాలను గుర్తించాలని హృదయ రాజు కోరారు. ఒక టీచర్ని సస్పెండ్ చేస్తే ఆరు నెలల వరకు పోస్టును భర్తీ చేయలేని పరిస్థితుల్లో ప్రభుత్వం ఉందన్నారు. వీటన్నింటిని గమనించి ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల హామీ మేరకు డిమాండ్లు పరిష్కరించాలని లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టడానికి సిద్ధమవుతామని చెప్పారు.