వ్యాన్ బోల్తాపడి 800 కోళ్లు మాయం - వైరల్ వీడియోలు
🎬 Watch Now: Feature Video

viral video కోళ్ల లోడ్తో వెళ్తున్న వ్యాన్ ప్రమాదవశాత్తు అదుపు తప్పి బోల్తా పడిన ఘటన తెలంగాణలోని మెదక్ జిల్లా రామాయంపేట మండలం లక్ష్మాపూర్ వద్ద చోటు చేసుకుంది. లక్ష్మాపూర్ నుంచి సిద్దిపేటకు 1200 కోళ్లతో వెళ్తున్న వాహనం లక్ష్మాపూర్ సబ్స్టేషన్ వద్దకు రాగానే అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో కోళ్లు చెల్లాచెదురుగా పడిపోయాయి. విషయం తెలుసుకున్న పరిసర ప్రాంతాల ప్రజలు, వాహనదారులు దొరికిన కోళ్లను దొరికినట్టుగా తీసుకెళ్లారు. ప్రమాదంలో స్వల్ప గాయాలతో బయటపడిన డ్రైవర్, సుమారు 800 కోళ్లను మాయం చేసినట్టు పేర్కొన్నాడు.
Last Updated : Feb 3, 2023, 8:29 PM IST