![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-6148490-106-6148490-1582268688787.jpg)
శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని కర్నూలు జిల్లాలో ఘనంగా నిర్వహిస్తున్నారు. శ్రీశైల మహాక్షేత్రం, ఓర్వకల్లు, ఎమ్మిగనూరు, మహానంది క్షేత్రం తదితర ప్రాంతాల్లోని శైవాలయాలకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. శివయ్యకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. చిన్నా పెద్దా అంతా హరహర మహాదేవ.. శంభోశంకర అంటూ స్వామివారిని సందర్శించుకున్నారు.