వెంకయ్యనాయుడుకు ఘన స్వాగతం, గజమాలతో సత్కారం - నెల్లూరు తాజా వార్తలు
🎬 Watch Now: Feature Video

Venkaiah Naidu: మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు నెల్లూరు నగరంలో ఘన స్వాగతం లభించింది. కస్తూర్బా గార్డెన్స్లో నిర్వహించే ఆత్మీయ అభినందన సభకు ర్యాలీగా వస్తుండగా.. వెంకయ్యను గజమాలతో సత్కరించారు. ఈ సభకు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా హాజరయ్యారు. ఏ ఎన్నికల్లోనూ తాను రూపాయి కూడా ఖర్చుపెట్టలేదని అందరూ సహకరించారని వెంకయ్యనాయుడు చెప్పారు. రాజకీయాల్లో తనను ఎవరూ శత్రువులుగా చూడలేదని తానూ అలాగే వ్యవహరించాలని తెలిపారు. ప్రస్తుతం చాలామంది ఓర్పు, నేర్పు కోల్పోతున్నారన్న వెంకయ్య వ్యక్తిగతంగా విమర్శలు చేసుకోవద్దని హితవు పలికారు.
Last Updated : Feb 3, 2023, 8:28 PM IST