కడప జిల్లా మైదుకూరు మండలం గంజికుంటలో విషాదం చోటుచేసుకుంది. గ్రామ సమీపంలోని బావిలో అనుమానాస్పద స్థితిలో ఇద్దరు గొర్రెల కాపరులు శవమై తేలారు. దువ్వూరు మండలం మదిరేపల్లె గ్రామానికి చెందిన రామకృష్ణ, బోగాదిగా పోలీసులు గుర్తించారు. సంఘటనా స్థలాన్ని డీఎస్పీ విజయ్కుమార్ పరిశీలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: ప్రమాదకరంగా స్తంభాలు... రైతులను కాపాడేదెవరు?