ETV Bharat / state

ఇరువర్గాల మధ్య ఘర్షణ... 13 మందికి గాయాలు

author img

By

Published : Jan 2, 2021, 4:20 PM IST

కడప జిల్లా మరియాపురంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. భజన కార్యక్రమంలో జరిగిన ఈ వివాదంలో కత్తులు, కర్రలు, రాళ్లతో దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో గాయాలపాలైన 13 మందికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.

thirteen people injured in  two groups quarreling at mariyapuram kadapa district
ఇరువర్గాల మధ్య ఘర్షణ... పదమూడు మందికి గాయాలు

ఇరువర్గాల మధ్య ఘర్షణ... పదమూడు మందికి గాయాలు

భజన కార్యక్రమం దగ్గర తలెత్తిన చిన్నపాటి వివాదం ఇరు వర్గాల మధ్య ఘర్షణకు దారి తీసింది. కడపలోని మరియాపురంలో చోటు చేసుకున్న ఈ ఘటనలో 13 మంది గాయపడగా... ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. స్థానిక మహిళలు కొత్త ఏడాది సందర్భంగా శుక్రవారం భజన కార్యక్రమం ఏర్పాటు చేయగా... కొంతమంది అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఘర్షణ తలెత్తకుండా పోలీసులు జోక్యం చేసుకొని సర్దిచెప్పారు. అయితే... ఈ ఉదయం మరోసారి పరస్పరం తలపడిన రెండు వర్గాలు... కత్తులు, కర్రలు, రాళ్లతో దాడి చేసుకున్నారు. పలువురికి తలపై గాయాలు కావడం సహా, కత్తిపోట్లకు గురయ్యారు. గాయపడిన వారికి ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు.

ఇరువర్గాల మధ్య ఘర్షణ... పదమూడు మందికి గాయాలు

భజన కార్యక్రమం దగ్గర తలెత్తిన చిన్నపాటి వివాదం ఇరు వర్గాల మధ్య ఘర్షణకు దారి తీసింది. కడపలోని మరియాపురంలో చోటు చేసుకున్న ఈ ఘటనలో 13 మంది గాయపడగా... ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. స్థానిక మహిళలు కొత్త ఏడాది సందర్భంగా శుక్రవారం భజన కార్యక్రమం ఏర్పాటు చేయగా... కొంతమంది అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఘర్షణ తలెత్తకుండా పోలీసులు జోక్యం చేసుకొని సర్దిచెప్పారు. అయితే... ఈ ఉదయం మరోసారి పరస్పరం తలపడిన రెండు వర్గాలు... కత్తులు, కర్రలు, రాళ్లతో దాడి చేసుకున్నారు. పలువురికి తలపై గాయాలు కావడం సహా, కత్తిపోట్లకు గురయ్యారు. గాయపడిన వారికి ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు.

ఇదీచదవండి.

రామతీర్థంలో ఎంపీ విజయసాయిరెడ్డి వాహనంపై రాళ్ల దాడి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.