శివాలయంలో పంచ లోహ విగ్రహాలను ఎత్తుకెళ్లిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. కడప జిల్లా వల్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని శివాలయంలో అదే ప్రాంతానికి చెందిన రాజశేఖర్ అనే వ్యక్తి 4 పంచలోహ విగ్రహాలను దొంగలించాడు. వాటిని విక్రయించేందుకు తీసుకెళ్తుండగా పోలీసులకు అనుమానం వచ్చి ఆ వ్యక్తిని తనిఖీ చేశారు. అతని వద్ద నుంచి నాలుగు పంచలోహ విగ్రహాలను స్వాధీనపర్చుకున్నారు. ఆలయాల్లో ఇటీవల చోరీలు జరుగుతున్నందున అన్ని ఆలయాలపై నిఘా ఉంచామని డీఎస్పీ సూర్యనారాయణ పేర్కొన్నారు.
ఇదీ చూడండి.
దుర్గ గుడి పైవంతెన ప్రారంభం.... వర్చువల్గా పాల్గొన్న జగన్, గడ్కరీ