ETV Bharat / state

ప్రొద్దుటూరు కూరగాయల మార్కెట్​లో ఉద్రిక్తత

author img

By

Published : Feb 11, 2021, 12:25 PM IST

కడప జిల్లా ప్రొద్దుటూరు కూరగాయల మార్కెట్​లో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. మార్కెట్లోని గదులను కూల్చివేసేందుకు పురపాలక అధికారులు జేసీబీతో వెళ్లటంతో ఘర్షణ వాతావరణం నెలకొంది.

proddatur vegitable market
ప్రొద్దుటూరు కూరగాయల మార్కెట్​లో కూల్చివేత పనులు

కడప జిల్లా ప్రొద్దుటూరు కూరగాయల మార్కెట్లోని గదులను కూల్చివేసేందుకు పురపాలక అధికారులు జేసీబీ తీసుకెళ్లారు. కూల్చివేతను వ్యాపారులు అడ్డుకున్నారు. అధికారులు, వ్యాపారుల మధ్య తోపులాట జరిగింది. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. వ్యాపారులు తనపై రాళ్లు రువ్వారని కమిషనర్ అనురాధ సీఐ నాగరాజుకు చెప్పడంతో.. మార్కెట్లో భారీగా పోలీసులు మోహరించారు. గొడవ జరగకుండా సీఐ, ఎస్సై.. వ్యాపారులకు సర్దిచెప్పారు. ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకొని అక్కడ పరిస్థితిపై ఆరా తీశారు. ప్రస్తుతం మార్కెట్లో కూల్చివేత పనులు కొనసాగుతున్నాయి.

ప్రొద్దుటూరు కూరగాయల మార్కెట్​లో గదుల కూల్చివేత

ఇదీ చదవండి: ఉద్ధృతంగా విశాఖ ఉక్కు పరిరక్షణ ఉద్యమం

కడప జిల్లా ప్రొద్దుటూరు కూరగాయల మార్కెట్లోని గదులను కూల్చివేసేందుకు పురపాలక అధికారులు జేసీబీ తీసుకెళ్లారు. కూల్చివేతను వ్యాపారులు అడ్డుకున్నారు. అధికారులు, వ్యాపారుల మధ్య తోపులాట జరిగింది. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. వ్యాపారులు తనపై రాళ్లు రువ్వారని కమిషనర్ అనురాధ సీఐ నాగరాజుకు చెప్పడంతో.. మార్కెట్లో భారీగా పోలీసులు మోహరించారు. గొడవ జరగకుండా సీఐ, ఎస్సై.. వ్యాపారులకు సర్దిచెప్పారు. ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకొని అక్కడ పరిస్థితిపై ఆరా తీశారు. ప్రస్తుతం మార్కెట్లో కూల్చివేత పనులు కొనసాగుతున్నాయి.

ప్రొద్దుటూరు కూరగాయల మార్కెట్​లో గదుల కూల్చివేత

ఇదీ చదవండి: ఉద్ధృతంగా విశాఖ ఉక్కు పరిరక్షణ ఉద్యమం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.