కడప జిల్లా రాజంపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో థాయ్ బాక్సింగ్, సిలంబం రాష్ట్రస్థాయి క్రీడా పోటీలను నిర్వహించారు. జిల్లాలో 45 ఎస్ జీఎఫ్ అండర్-19 క్రీడలకు ఎంపిక నిర్వహిస్తుండగా,40 క్రీడల్లో ఎంపికలు పూర్తి చేసినట్లు ఎస్ జీఎఫ్ అండర్-19 జిల్లా కార్యదర్శి శారద తెలిపారు. ఈ పోటీల్లో పాల్గొనేందుకు విద్యార్ధులు అనంతపురం, కర్నూలు, కడప,నెల్లూరు జిల్లాల నుంచి క్రీడాకారులు తరలివచ్చారు. పోటీల్లో ప్రతిభ కనపరిచిన వారిని జాతీయస్థాయి పోటీలో పాల్గొనే రాష్ట్ర జట్టుకు ఎంపిక చేసినట్లు తెలిపారు.
ఇదీ చూడండి: రాజంపేటలో.. ఎస్జీఎఫ్ అండర్ -19 క్రీడా పోటీలు ప్రారంభం