ETV Bharat / state

20 లక్షల విలువైన ఎర్రచందనం దుంగలు స్వాధీనం

author img

By

Published : Mar 4, 2020, 6:51 PM IST

కడప జిల్లా నుంచి చిత్తూరుకు తరలిపోతున్న ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆరుగురు నిందితుల్లో నలుగురు పరారవ్వగా, ఇద్దర్ని అదుపులోకి తీసుకున్నారు.

red sandle smugglers arrest by cadapa rims police
ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్న కడప రిమ్స్ పోలీస్
ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్న కడప రిమ్స్ పోలీస్

కడప జిల్లా నుంచి చిత్తూరు జిల్లాకు తరలుతున్న ఎర్రచందనం దుంగలను కడప రిమ్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రాజంపేట వద్ద వాహన తనిఖీలు చేపట్టారు. కడప వైపు వస్తున్న బొలేరో వాహనాన్ని తనిఖీ చేశారు. 20 లక్షల విలువైన 21 ఎర్రచందనం దుంగలు బయటపడ్డాయి. చిత్తూరుకు చెందిన నలుగురు వాహనం నుంచి దుంకి వ్యక్తులు పారిపోగా, తమిళనాడుకు చెందిన ఇద్దరు స్మగ్లర్లు పోలీసులకు చిక్కారు. వీరిని ఇళయరాజ, తంగరాజ్​లుగా గుర్తించినట్లు డీఎస్పీ సూర్యనారాయణ వివరించారు. కడపలో ఉన్న స్మగ్లర్​కు అందజేసేందుకు దుంగలను రవాణా చేస్తున్నట్లు నిందితులు తెలిపారన్నారు. పూర్తి వివరాలపై ఆరా తీస్తున్నట్టు చెప్పారు.

ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్న కడప రిమ్స్ పోలీస్

కడప జిల్లా నుంచి చిత్తూరు జిల్లాకు తరలుతున్న ఎర్రచందనం దుంగలను కడప రిమ్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రాజంపేట వద్ద వాహన తనిఖీలు చేపట్టారు. కడప వైపు వస్తున్న బొలేరో వాహనాన్ని తనిఖీ చేశారు. 20 లక్షల విలువైన 21 ఎర్రచందనం దుంగలు బయటపడ్డాయి. చిత్తూరుకు చెందిన నలుగురు వాహనం నుంచి దుంకి వ్యక్తులు పారిపోగా, తమిళనాడుకు చెందిన ఇద్దరు స్మగ్లర్లు పోలీసులకు చిక్కారు. వీరిని ఇళయరాజ, తంగరాజ్​లుగా గుర్తించినట్లు డీఎస్పీ సూర్యనారాయణ వివరించారు. కడపలో ఉన్న స్మగ్లర్​కు అందజేసేందుకు దుంగలను రవాణా చేస్తున్నట్లు నిందితులు తెలిపారన్నారు. పూర్తి వివరాలపై ఆరా తీస్తున్నట్టు చెప్పారు.

ఇదీ చదవండి:

'ఉపాధి తగ్గింది.. ప్రభుత్వమే ఆదుకోవాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.