కొన్నేళ్ల నుంచి తీసుకుంటున్న వృద్ధాప్య, వితంతు పింఛన్లను రద్దు చేయడం దారుణమని వృద్ధులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తీసేసిన పింఛన్లను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ... కడప కార్పొరేషన్ వద్ద సీపీఐ ఆధ్వర్యంలో వృద్ధులు, వితంతువులు ధర్నా చేపట్టారు. చేతిలో పింఛన్ల పుస్తకాలు పట్టుకుని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇంట్లో ఎంతమంది అర్హులుంటే వారందరికీ పింఛన్లు ఇస్తామని ఓట్లు వేయించుకునేటప్పుడు చెప్పిన జగన్..... ఇప్పుడు ఇల్లు, కరెంట్ బిల్లులను సాకుగా చూపడమేంటని మండిపడ్డారు.
ఇవీ చదవండి...కొత్త నిబంధనలతో కష్టాలు..పింఛను రాక వృద్ధుల రోదన