కడప జిల్లా కలసపాడు మండలం అక్కిశుద్ధి పల్లె వద్ద ఉన్న తెలుగుగంగ ఎడమ కాలువలో చేపలు వేట కోసం వెళ్లి ఓ వ్యక్తి గల్లంతయ్యారు. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు కాలువలోకి గాలింపు చర్యలు చేపట్టారు. మృతదేహం కనిపించకపోవడంతో వెనుదిరిగారు.
వెంటనే అతని వెంట వచ్చిన వారు... కాలువలోకి దిగి వెతికిన ఆచూకీ లభించలేదు. కాలువలో పది అడుగుల లోతు వరకు నీరు ప్రవహిస్తుంది. గల్లంతైన వ్యక్తికి భార్య ముగ్గురు పిల్లలు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇదీ చదవండి: