ETV Bharat / state

కుక్కలను పట్టించారు.. డబ్బులు మాత్రం చెల్లించలేదు

author img

By

Published : Mar 5, 2021, 10:07 PM IST

కడప జిల్లా కమలాపురం నగర పంచాయతీలో కుక్కల బెడద ఎక్కువగా ఉంది. వాటిని పట్టించిన వారికి డబ్బులు ఇవ్వటం లేదని కమిషనర్ కార్యాలయం వద్ద బాధితులు వాపోతున్నారు.

victims
బాధితులు
డబ్బులు చెల్లించాలంటూ కుక్కలను పట్టించిన వారి ఆవేదన

కడప జిల్లా కమలాపురం మండలం కమలాపురం నగర పంచాయతీలో కుక్కల విహారం ఎక్కువైంది. వాటి వల్ల స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కుక్కలను పట్టించేందుకు మున్సిపల్​ వారు నెల్లూరు నుంచి కొంతమందిని పిలిపించారు. ఐదు నెలల నుంచి దాదాపు 300 వరకు కుక్కలను పట్టుకున్నామని.. డబ్బులు మాత్రం ఇవ్వలేదని కమిషనర్ కార్యాలయం వద్ద బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సుమారు 45 వేల రూపాయలు చెల్లించాల్సి ఉందని.. ఎన్నిసార్లు కార్యాలయం చుట్టూ తిరిగినా పట్టించుకునే వారే లేరని వాపోతున్నారు.

ఇదీ చదవండి: అంతర్వేది తీరంలో డాల్ఫిన్ల సందడి!

డబ్బులు చెల్లించాలంటూ కుక్కలను పట్టించిన వారి ఆవేదన

కడప జిల్లా కమలాపురం మండలం కమలాపురం నగర పంచాయతీలో కుక్కల విహారం ఎక్కువైంది. వాటి వల్ల స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కుక్కలను పట్టించేందుకు మున్సిపల్​ వారు నెల్లూరు నుంచి కొంతమందిని పిలిపించారు. ఐదు నెలల నుంచి దాదాపు 300 వరకు కుక్కలను పట్టుకున్నామని.. డబ్బులు మాత్రం ఇవ్వలేదని కమిషనర్ కార్యాలయం వద్ద బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సుమారు 45 వేల రూపాయలు చెల్లించాల్సి ఉందని.. ఎన్నిసార్లు కార్యాలయం చుట్టూ తిరిగినా పట్టించుకునే వారే లేరని వాపోతున్నారు.

ఇదీ చదవండి: అంతర్వేది తీరంలో డాల్ఫిన్ల సందడి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.