ETV Bharat / state

కడప జిల్లాలో కర్షకుల ఆందోళన..రోడ్డుపై బైఠాయింపు - రోడ్డుపై బైఠాయించిన మడురు రైతులు

కడప జిల్లా తొండూరు మండలం మడురు వద్ద.. రోడ్డుపై ధర్నా నిర్వహించి రైతులు ఆందోళన చేశారు. దిల్లీలో నిరసన చేపడుతున్న కర్షకుల పిలుపు మేరకు.. రెండు గంటలపాటు వాహన రాకపోకలు నిలిపివేసి ఆగ్రహాన్ని తెలియజేశారు. రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలంటూ.. వేంపల్లిలో కాంగ్రెస్, సీపీఐ నేతలు నిరసన ప్రదర్శన నిర్వహించారు.

bund in kadapa
నిరసన వ్యక్తం చేస్తున్న రైతులు, వివిధ పార్టీల నేతలు
author img

By

Published : Dec 8, 2020, 9:28 PM IST

భారత్ బంద్​కు రైతు సంఘాల పిలుపు మేరకు.. కడప జిల్లా తొండూరు మండలం మడురు వద్ద రోడ్డుపై అన్నదాతలు ధర్నా నిర్వహించారు. రెండు గంటల పాటు వాహనాల రాకపోకలు నిలిపివేశారు. వివిధ లోటుపాట్లతో కూడిన ప్రస్తుత వ్యవసాయ చట్టాలను రద్దుచేసి.. రైతాంగానికి ఉపయోగపడే కొత్త చట్టాలు చేయాలని కర్షకులు డిమాండ్ చేశారు.

వేంపల్లిలోనూ సీపీఐ, కాంగ్రెస్​ నేతలు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. రైతుల పొట్ట కొట్టే విధంగా ఉన్న చట్టాలను వెనక్కి తీసుకోవాలని నినాదాలు చేశారు. కేంద్రం అన్నదాతకు అన్యాయం చేస్తోందని మండిపడ్డారు.

భారత్ బంద్​కు రైతు సంఘాల పిలుపు మేరకు.. కడప జిల్లా తొండూరు మండలం మడురు వద్ద రోడ్డుపై అన్నదాతలు ధర్నా నిర్వహించారు. రెండు గంటల పాటు వాహనాల రాకపోకలు నిలిపివేశారు. వివిధ లోటుపాట్లతో కూడిన ప్రస్తుత వ్యవసాయ చట్టాలను రద్దుచేసి.. రైతాంగానికి ఉపయోగపడే కొత్త చట్టాలు చేయాలని కర్షకులు డిమాండ్ చేశారు.

వేంపల్లిలోనూ సీపీఐ, కాంగ్రెస్​ నేతలు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. రైతుల పొట్ట కొట్టే విధంగా ఉన్న చట్టాలను వెనక్కి తీసుకోవాలని నినాదాలు చేశారు. కేంద్రం అన్నదాతకు అన్యాయం చేస్తోందని మండిపడ్డారు.

ఇదీ చదవండి:

ఉత్తర్​ప్రదేశ్​లో కిడ్నాపై.. కడపకు చేరి..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.