ETV Bharat / state

కడప మహిళా కారాగార వార్డెన్​ నాగమణికి రాష్ట్రపతి అవార్డు - kadapa women jail warden nagamani president award story

నేరాలు చేసి జైలుకు వచ్చిన వారిని శిక్షించకుండా వారిలో పరివర్తన తీసుకురావడానికి జైలు సిబ్బంది  ప్రయత్నిస్తుంటారు. మళ్లీ అలాంటి తప్పులు చేయకుండా వారిలో మార్పు తీసుకువచ్చేందుకు.. మనోధైర్యాన్ని పెంచేందుకు నిత్యం వారిని ఓ కంట కనిపెడుతూ ఉంటారు. అలాంటి వారిలో నాగమణి ఒకరు. కడప జిల్లా ప్రత్యేక మహిళా కారాగారంలో చీఫ్​ హెడ్​ వార్డెన్​గా విధులు నిర్వహిస్తున్న ఈమె ప్రతిష్ఠాత్మకమైన రాష్ట్రపతి అవార్డుకు ఎంపికయ్యారు.

కడప మహిళా కారాగార వార్డెన్​ నాగమణికి రాష్ట్రపతి అవార్డు
కడప మహిళా కారాగార వార్డెన్​ నాగమణికి రాష్ట్రపతి అవార్డు
author img

By

Published : Jan 27, 2020, 6:37 PM IST

మహిళా జైలు వార్డెన్​ను వరించిన రాష్ట్రపతి అవార్డు
తూర్పుగోదావరి జిల్లా మహిళా జైల్లో 1999లో వార్డెన్​గా ఉద్యోగ ప్రస్థానం ప్రారంభించిన నాగమణి అంచెలంచెలుగా ఎదిగి ప్రస్తుతం కడప మహిళా ప్రత్యేక కారాగారంలో చీఫ్ హెడ్ వార్డెన్​గా విధులు నిర్వహిస్తున్నారు. ఖైదీల పట్ల ప్రేమ, జాలి చూపిస్తూ వారు పడే మనోవేదన నుంచి బయటకు తీసుకువచ్చేందుకు తన వంతు ప్రయత్నం చేస్తారు. వృద్ధులకు, అనారోగ్యంతో ఉన్న వారికి మానవతా దృక్పథంతో సేవలు అందిస్తారు. ఈ పనితీరే ఆమెకు రాష్ట్రపతి అవార్డును తెచ్చిపెట్టింది.

మూడు అవార్డుల్లో ఏకైక మహిళగా..!

వివిధ రంగాల్లో విశేషమైన సేవలందించిన వారికి ఏటా రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డులు ప్రదానం చేస్తారు. నాగమణికి ఈసారి రాష్ట్రపతి సంస్కరణల సేవా పతకం వరించింది. జైళ్ల శాఖలో వచ్చిన మూడు అవార్డుల్లో ఏకైక మహిళగా ఈమె నిలవడం గమనార్హం. తనకు ఈ అవార్డు రావడంపై నాగమణి సంతోషం వ్యక్తం చేశారు. తాను అందరితో కలిసిపోయి తన విధులు సక్రమంగా నిర్వహిస్తానని.. జైళ్ల శాఖ ఉన్నతాధికారులు తనను రాష్ట్రపతి అవార్డుకు ఎంపిక చేయడం ఆనందంగా ఉందని నాగమణి అన్నారు.

అధికారుల అభినందన

నాగమణికి రాష్ట్రపతి అవార్డు రావడం పట్ల జైలు ఇంఛార్జీ సూపరింటెండెంట్ వసంత ఆనందం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో జైళ్ల శాఖకు మూడు అవార్డులు రావడం అందులో తమ కారాగారానికి చెందిన నాగమణికి అవార్డు రావడం సంతోషంగా ఉందని తెలిపారు. నాగమణికి రాష్ట్రపతి అవార్డు రావడంపై ఇతర జైలు సిబ్బంది, ఉన్నతాధికారులు అభినందనలు తెలియజేశారు. ఈ అవార్డు మహిళలందరికీ దక్కిన గౌరవంగా అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో మరిన్ని నాగమణి మరింత గుర్తింపు సాధించాలని ఆకాంక్షించారు.

ఇదీ చూడండి:

'మండలి రద్దు'పై మండిపడ్డ రాజధాని రైతులు

మహిళా జైలు వార్డెన్​ను వరించిన రాష్ట్రపతి అవార్డు
తూర్పుగోదావరి జిల్లా మహిళా జైల్లో 1999లో వార్డెన్​గా ఉద్యోగ ప్రస్థానం ప్రారంభించిన నాగమణి అంచెలంచెలుగా ఎదిగి ప్రస్తుతం కడప మహిళా ప్రత్యేక కారాగారంలో చీఫ్ హెడ్ వార్డెన్​గా విధులు నిర్వహిస్తున్నారు. ఖైదీల పట్ల ప్రేమ, జాలి చూపిస్తూ వారు పడే మనోవేదన నుంచి బయటకు తీసుకువచ్చేందుకు తన వంతు ప్రయత్నం చేస్తారు. వృద్ధులకు, అనారోగ్యంతో ఉన్న వారికి మానవతా దృక్పథంతో సేవలు అందిస్తారు. ఈ పనితీరే ఆమెకు రాష్ట్రపతి అవార్డును తెచ్చిపెట్టింది.

మూడు అవార్డుల్లో ఏకైక మహిళగా..!

వివిధ రంగాల్లో విశేషమైన సేవలందించిన వారికి ఏటా రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డులు ప్రదానం చేస్తారు. నాగమణికి ఈసారి రాష్ట్రపతి సంస్కరణల సేవా పతకం వరించింది. జైళ్ల శాఖలో వచ్చిన మూడు అవార్డుల్లో ఏకైక మహిళగా ఈమె నిలవడం గమనార్హం. తనకు ఈ అవార్డు రావడంపై నాగమణి సంతోషం వ్యక్తం చేశారు. తాను అందరితో కలిసిపోయి తన విధులు సక్రమంగా నిర్వహిస్తానని.. జైళ్ల శాఖ ఉన్నతాధికారులు తనను రాష్ట్రపతి అవార్డుకు ఎంపిక చేయడం ఆనందంగా ఉందని నాగమణి అన్నారు.

అధికారుల అభినందన

నాగమణికి రాష్ట్రపతి అవార్డు రావడం పట్ల జైలు ఇంఛార్జీ సూపరింటెండెంట్ వసంత ఆనందం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో జైళ్ల శాఖకు మూడు అవార్డులు రావడం అందులో తమ కారాగారానికి చెందిన నాగమణికి అవార్డు రావడం సంతోషంగా ఉందని తెలిపారు. నాగమణికి రాష్ట్రపతి అవార్డు రావడంపై ఇతర జైలు సిబ్బంది, ఉన్నతాధికారులు అభినందనలు తెలియజేశారు. ఈ అవార్డు మహిళలందరికీ దక్కిన గౌరవంగా అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో మరిన్ని నాగమణి మరింత గుర్తింపు సాధించాలని ఆకాంక్షించారు.

ఇదీ చూడండి:

'మండలి రద్దు'పై మండిపడ్డ రాజధాని రైతులు

Intro:AP_CDP_17_27_PRESIDENT_AWARD_PKG_AP10040
సుందర్, ఈ టీవీ కంట్రిబ్యూటర్, కడప.
శివరామ చారి , ఈజేఎస్.

యాంకర్

వివిధ రంగాల్లో విశేషమైన సేవలందించిన వారికి ఏటా రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డులు ప్రదానం చేస్తారు. కడప జిల్లా ప్రత్యేక మహిళా కారాగారంలో చీఫ్ హెడ్ వార్డెన్ గా పనిచేస్తున్న నాగమణి కి ఈసారి రాష్ట్రపతి సంస్కరణల సేవా పతకం వరించింది. జైళ్ల శాఖ లో వచ్చిన మూడు అవార్డులు లో ఏకైక మహిళగా నిలిచింది.
P TO C

వాయిస్ ఓవర్

నేరాలు తప్పులు చేసి జైలుకు వచ్చిన వారిని శిక్షించకుండా వారిలో పరివర్తన తీసుకురావడానికి జైలు సిబ్బంది ప్రయత్నిస్తుంటారు. మరలా అలాంటి తప్పులు చేయకుండా ఉండడానికి వారిలో మనోధైర్యాన్ని పెంచడానికి నిత్యం వారిని కనిపెడుతూ వారిలో మార్పు తీసుకురావడానికి కృషి చేస్తారు. అలాంటి వారిలో నాగమణి ఒకరు ఈమె కడప జిల్లా ప్రత్యేక మహిళ కారాగారంలో చీఫ్ హెడ్ వార్డెన్ గా విధులు నిర్వహిస్తూ ప్రతిష్టాత్మకమైన రాష్ట్రపతి అవార్డుకు ఎంపికైంది.

వాయిస్ ఓవర్

1999లో వార్డెన్ గా తూర్పుగోదావరి జిల్లా మహిళా జైల్లో ఉద్యోగ ప్రస్థానం ప్రారంభించిన నాగమణి అంచలంచలుగా ఎదిగి ప్రస్తుతం కడప మహిళా ప్రత్యేక కారాగారంలో చీఫ్ హెడ్ వార్డెన్ గా విధులు నిర్వహిస్తున్నారు. ఖైదీల పట్ల ప్రేమ జాలి చూపిస్తూ వారు పడే మనోవేదన నుంచి బయటకు తీసుకువచ్చేందుకు నిరంతరం తన వంతు ప్రయత్నం చేస్తానని అని ఆమె తెలిపారు. వృద్ధులకు అనారోగ్యంగా ఉన్న వారికి మానవతా దృక్పథంతో సేవలు అందిస్తామని తెలిపారు. తనకు రాష్ట్రపతి సేవా అవార్డు రావడం పట్ల ఆమె సంతోషం వ్యక్తం చేశారు తొలిసారిగా అవార్డు వచ్చినందుకు ఆమె సంతోషానికి అవధులు లేకుండా పోయాయి.
బైట్ నాగమణి, రాష్ట్రపతి అవార్డు విజేత చీఫ్ హెడ్ వార్డెన్ ప్రత్యేక మహిళ కారాగారం, కడప.
వాయిస్ ఓవర్:
తాను అందరితో కలిసిపోయి తన విధులను సక్రమంగా నిర్వహిస్తూ ఉంటానని అది గుర్తించిన జైలు అధికారులు జైళ్ల శాఖ ఉన్నతాధికారులు తనను ఈ అవార్డుకు ఎంపిక చేయడం పట్ల ఆమె హర్షం వ్యక్తం చేశారు. తన విధి నిర్వహణలో ఎప్పటికైనా తోటి సిబ్బందితో ఖైదీలతో సహృదయ భావంతో ఉంటానని తెలిపారు. నాగమణికి రాష్ట్రపతి అవార్డు రావడం పట్ల జైలు ఇన్చార్జి సూపరిండెంట్ వసంత ఆనందం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో జైళ్ల శాఖకు మూడు అవార్డులు రావడం అందులో తమ కారాగారానికి చెందిన నాగమణి కి రావడం సంతోషం అన్నారు. ఆమెకు ఈ అవార్డు రావడం మహిళలందరికీ గర్వకారణమని అభిప్రాయపడ్డారు.
బైట్:
వసంత, జైలు ఇన్చార్జ్ సూపరింటెండెంట్ ప్రత్యేక మహిళ కారాగారం, కడప.
ఎండ్ వాయిస్:
నాగమణి కి రాష్ట్రపతి అవార్డు రావడం పట్ల సిబ్బంది ఉన్నతాధికారులు అభినందనలు తెలియజేశారు. మహిళలకు ఇలాంటి గౌరవం దక్కడం పట్ల వారు ఆనందం వ్యక్తం చేశారు.
END P TO C


Body:ప్రత్యేక మహిళా కారాగారం చీఫ్ హెడ్ వార్డెన్కు రాష్ట్రపతి అవార్డు


Conclusion:కడప

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.