కడప జిల్లా జమ్మలమడుగు పట్టణంలోని ప్రభుత్వ మద్యం దుకాణాల్లో ఆబ్కారీ శాఖ అధికారులు దాడులు చేశారు. శనివారం పట్టణంలోని కొన్ని మద్యం దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్థానిక సంజామల మోటు లోని ఓ దుకాణంలో గడువు ముగిసిన 44 బీర్ కేసులను గుర్తించారు. జిల్లాలోని ప్రొద్దుటూరు, జమ్మలమడుగులోని వివిధ మద్యం దుకాణాలపై రెండురోజులుగా దాడులు చేసి కాలం చెల్లిన మద్యం సీసాలను ధ్వంసం చేసినట్లు ఎక్సైజ్ ఎస్సై కవిత తెలిపారు.
ఇదీ చదవండి:
ఏప్రిల్ 21 నుంచి ఒంటిమిట్టలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు.. ఏర్పాట్లపై జేఈఓ సమీక్ష