ETV Bharat / state

ప్రొద్దుటూరులో 4 పాజిటివ్ కేసులు.. జిల్లాలో 73కు చేరిక!

author img

By

Published : Apr 30, 2020, 3:39 PM IST

కడప జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు 73కు చేరాయి. అప్రమత్తమైన అధికార యంత్రాంగం పటిష్టమైన చర్యలు చేపట్టింది. లాక్ డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేస్తోంది.

corona cases in kadapa district
కడప జిల్లాలో కరోనా కేసులు

కడప జిల్లాలో రోజురోజుకూ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ఈరోజు మరో 4 కేసులు నమోదయ్యాయి. ఇవన్నీ ప్రొద్దుటూరులోనే వెలుగుచూశాయి. ఇందులో ఇద్దరు కానిస్టేబుళ్లు కాగా మరో ఇద్దరు వైద్య సిబ్బంది ఉన్నట్లు అధికారులు తెలిపారు. దిల్లీ మత ప్రార్థనలకు వెళ్లొచ్చినవారి కారణంగానే కొవిడ్ కేసులు పెరుగుతున్నట్లు చెప్పారు.

ఈ 4 కేసులతో కలిపి జిల్లాలో మొత్తం కరోనా పాజిటివ్ కేసులు 73కు చేరాయి. ఇందులో 28 మంది డిశ్చార్జి కాగా.. 45 కేసులు యాక్టివ్​గా ఉన్నాయి. కడప, ప్రొద్దుటూరు, మైదుకూరు, బద్వేల్, పులివెందుల, వేంపల్లి, ఎర్రగుంట్ల, కమలాపురం, చెన్నూరు, పుల్లంపేట, సీకే దిన్నె ప్రాంతాల్లో కరోనా కేసులు నమోదయ్యాయి. ఈరోజు జిల్లాలోని 164 మంది సీనియర్ పాత్రికేయులకు కొవిడ్ పరీక్షలు చేశారు. జిల్లా కలెక్టర్ కూడా స్వాబ్ శాంపిల్స్ ఇచ్చారు.

కడప జిల్లాలో రోజురోజుకూ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ఈరోజు మరో 4 కేసులు నమోదయ్యాయి. ఇవన్నీ ప్రొద్దుటూరులోనే వెలుగుచూశాయి. ఇందులో ఇద్దరు కానిస్టేబుళ్లు కాగా మరో ఇద్దరు వైద్య సిబ్బంది ఉన్నట్లు అధికారులు తెలిపారు. దిల్లీ మత ప్రార్థనలకు వెళ్లొచ్చినవారి కారణంగానే కొవిడ్ కేసులు పెరుగుతున్నట్లు చెప్పారు.

ఈ 4 కేసులతో కలిపి జిల్లాలో మొత్తం కరోనా పాజిటివ్ కేసులు 73కు చేరాయి. ఇందులో 28 మంది డిశ్చార్జి కాగా.. 45 కేసులు యాక్టివ్​గా ఉన్నాయి. కడప, ప్రొద్దుటూరు, మైదుకూరు, బద్వేల్, పులివెందుల, వేంపల్లి, ఎర్రగుంట్ల, కమలాపురం, చెన్నూరు, పుల్లంపేట, సీకే దిన్నె ప్రాంతాల్లో కరోనా కేసులు నమోదయ్యాయి. ఈరోజు జిల్లాలోని 164 మంది సీనియర్ పాత్రికేయులకు కొవిడ్ పరీక్షలు చేశారు. జిల్లా కలెక్టర్ కూడా స్వాబ్ శాంపిల్స్ ఇచ్చారు.

ఇవీ చదవండి

వలస కూలీలకు.. 'అమృత' హస్తం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.