కడప పెద్ద దర్గా ఉరుసు మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రాత్రి అఖిలభారత 77వ కవి సమ్మేళనం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ముంబైకి చెందిన ప్రముఖ సింగర్ సుఖేందర్ సింగ్ హాజరయ్యారు. దేశ నలుమూలల నుంచి భారీ సంఖ్యలో భక్తులు వచ్చారు. కవి సమ్మేళనంలో కవులు తమదైన శైలిలో అలరించారు. దర్గా ఆవరణలో రంగురంగుల దీపాల కాంతులు విరజిల్లాయి.
యాంకర్: ప్రసిద్ధిగాంచిన కడప పెద్ద దర్గా ఉరుసు మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రాత్రి అఖిలభారత 77వ కవి సమ్మేళనం నిర్వహించారు. కవి సమ్మేళనానికి ముఖ్య అతిథిగా ముంబైకి చెందిన ప్రముఖ సింగర్ సుఖేందర్ సింగ్ హాజరయ్యారు. దర్గా పీఠాధిపతి ఆయనకు ఘన స్వాగతం పలికారు. దర్గాలో ఆయన ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. దేశ నలుమూలల నుంచి భారీ సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పెద్ద దర్గా ఆవరణలో రంగురంగుల దీపాలతో కాంతులు విరాజిల్లాయి. దర్గా ఆవరణమంతా భక్తులతో కిటకిటలాడింది. కవి సమ్మేళనం లో కవులు తమదైన శైలిలో అలరించారు. రేపు రాత్రి నగరంలో భారీ ఎత్తున ఊరేగింపు కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తారు.