మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ వ్యాఖ్యలను ఖండిస్తూ కడప అంబేడ్కర్ కూడలి వద్ద బీజేవైఎం ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. మంత్రిని బర్తరఫ్ చేయాలని కోరుతూ నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిధులతో మసీదులు, చర్చిలను పునర్ నిర్మిస్తామని... వెల్లంపల్లి అనడం సబబు కాదని బీజేవైఎం కడప జిల్లా అధ్యక్షులు పవన్ కుమార్ తప్పుపట్టారు. అన్ని మతాలను ఒకే దృష్టితో చూడాలే తప్ప.. కేవలం చర్చిలు, మసీదులను అభివృద్ధి చేస్తామని చెప్పడం దారుణమన్నారు.
ఈ వ్యాఖ్యలు హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయన్నారు. మంత్రి వెంటనే తన మాటలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు.
ఇవీ చదవండి