ETV Bharat / state

'సౌరఫలకాల ధ్వంసం కేసులో నలుగురు అరెస్ట్'

కడప జిల్లా రామచంద్రాపురం సోలార్ పరిశ్రమలో ఫలకాలు ధ్వంసం చేసిన నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. 4 గొడ్డళ్లు, 2 ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు.

author img

By

Published : Jul 7, 2019, 7:36 AM IST

'సౌరఫలకాల ధ్వంసం కేసులో నలుగురు అరెస్ట్'
'సౌరఫలకాల ధ్వంసం కేసులో నలుగురు అరెస్ట్'

కడప జిల్లా మైలవరం మండలం సౌరఫలకాల ధ్వంసం కేసులో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు నాగార్జున, రమేశ్‌ సుబ్బారాయుడు, గంగరాజుల నుంచి 4 గొడ్డళ్లు, 2 వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. జూన్ 30న రామచంద్రపల్లె సమీపంలో ఉన్న సోలార్ పరిశ్రమలో చొరబడి 17వందల 19 సౌర ఫలకాలను గొడ్డళ్లతో ధ్వంసం చేసినట్లు జమ్మలమడుగు డీఎస్పీ తెలిపారు. గతంలో వీరి భూములను ప్రాజెక్ట్ యాజమాన్యం స్వాధీనం చేసుకుని డబ్బులు చెల్లించకపోవటం... సెక్యూరిటీ గార్డులను విధుల నుంచి తొలగించటం వంటి వాటిని కారణాలుగా చూపిస్తూ... నిందితులు ఈ పనికి ఒడిగట్టినట్లు డీఎస్పీ తెలిపారు.

'సౌరఫలకాల ధ్వంసం కేసులో నలుగురు అరెస్ట్'

కడప జిల్లా మైలవరం మండలం సౌరఫలకాల ధ్వంసం కేసులో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు నాగార్జున, రమేశ్‌ సుబ్బారాయుడు, గంగరాజుల నుంచి 4 గొడ్డళ్లు, 2 వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. జూన్ 30న రామచంద్రపల్లె సమీపంలో ఉన్న సోలార్ పరిశ్రమలో చొరబడి 17వందల 19 సౌర ఫలకాలను గొడ్డళ్లతో ధ్వంసం చేసినట్లు జమ్మలమడుగు డీఎస్పీ తెలిపారు. గతంలో వీరి భూములను ప్రాజెక్ట్ యాజమాన్యం స్వాధీనం చేసుకుని డబ్బులు చెల్లించకపోవటం... సెక్యూరిటీ గార్డులను విధుల నుంచి తొలగించటం వంటి వాటిని కారణాలుగా చూపిస్తూ... నిందితులు ఈ పనికి ఒడిగట్టినట్లు డీఎస్పీ తెలిపారు.

AP_SKLM_100_06_ATTN_TICKER_C1 FROM: CH. ESWARA RAO, SRIKAKULAM. JULY 06 Note:- today (07-07-2019) ticker points ------------------------------------------------------------------------------------------- శ్రీకాకుళం: నేడు డివిజనల్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌ పరీక్ష, జిల్లాలో 8 పరీక్ష కేంద్రాలు ఏర్పాట్లు. శ్రీకాకుళం బాపూజీ కళామందిరంలో సాయంత్రం 6 గంటల నుండి పంచ మృదంగ లయ వాద్య నాద వేద తరంగణి. గుజరాతీపేట, ఇలిసిపురంలో జగన్నాథస్వామి రథయాత్ర ఉత్సవాలు, నేడు వామనావతారంలో దర్శనం ఇవ్వనున్న జగన్నాథుడు. ఏడు రోడ్ల కూడలిలో నేడు భాజాపా సభ్యత్వ నమోదు కార్యక్రమం. పాలకొండ: వీరఘట్టం గుండిచా మందిరంలో జగన్నాథస్వామి రథయాత్ర ఉత్సవాలు, నేడు వామనావతారంలో దర్శనం ఇవ్వనున్న జగన్నాథుడు. టెక్కలి: సంతబొమ్మాళి మండలం నౌపడలో పాలపోలమ్మ తల్లి గ్రామ దేవత ఉత్సవాలు. పలాస: పలాస రైల్వే కాలనీలోని గుండిచా మందిరంలో జగన్నాథస్వామి రథయాత్ర ఉత్సవాలు, నేడు వామనావతారంలో దర్శనం ఇవ్వనున్న జగన్నాథస్వామి. పలాస ఇందిరాచౌక్‌ వద్ద నేడు ఎమ్మెల్యే అప్పలరాజు ఆధ్వర్యంలో గుడ్‌మార్నింగ్‌ పేరిట 22 వార్డులో పర్యటన. ఇచ్చాపురం: మంత్రి ధర్మాన కృష్ణదాస్‌ పుట్టినరోజు సందర్భంగా ఇచ్చాపురం స్వేచ్ఛావతి అమ్మవారి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేయనున్న వైకాపా నాయకులు. ఇచ్చాపురం జ్ఞానభారతి పాఠశాల అవరణలో ఈరోజు రోటరీ క్లబ్‌ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.