కడప జిల్లా బద్వేలులోని శ్రీ కన్యకా పరమేశ్వరి బాలుర ఉన్నత పాఠశాల శత వార్షికోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అన్నమయ్య సంగీత విభావరి నేత్రపర్వంగా సాగింది. తిరుమల తిరుపతి దేవస్థాన ఆస్థాన గాయకుడు గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ అన్నమాచార్య కీర్తనలు ఆలపించి సభికులను రంజింపజేశారు. ఈ కార్యక్రమానికి పెద్దఎత్తున సంగీత ప్రియులు హాజరయ్యారు.