ETV Bharat / state

నేడు వైఎస్​ఆర్ ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ...ఏలూరులో సీఎం శ్రీకారం

author img

By

Published : Jan 3, 2020, 6:14 AM IST

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మంకంగా చేపట్టిన వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కార్డులను నేటి నుంచి పంపిణీ చేయనున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేతుల మీదుగా పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో ఈ కార్డులను ఆవిష్కరించనున్నారు. ఇప్పటి వరకూ అందిస్తున్న 1000 వ్యాధుల చికిత్సలకు అందనంగా మరిన్ని జోడించి మొత్తం 2059 వ్యాధులకు వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం కింద చికిత్స అందించనున్నారు. ఈ పథకాన్ని పశ్చిమ గోదావరి జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా సీఎం ప్రారంభించనున్నారు. మిగతా చోట్ల 1259 రోగాలకు చికిత్స అందించేలా ప్రభుత్వం కార్యాచరణ చేపట్టింది.

Ysr arogyasri pilot project will start by cm jagan at eluru
నేడు వైఎస్​ఆర్ ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ...ఏలూరులో సీఎం శ్రీకారం
నేడు వైఎస్​ఆర్ ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ...ఏలూరులో సీఎం శ్రీకారం
వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకంలో భాగంగా లబ్ధిదారులకు కార్డుల పంపిణీని ప్రభుత్వం ఇవాళ్టి నుంచి ప్రారంభించనుంది. రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్డులను జారీ చేసే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో శ్రీకారం చుట్టునున్నారు. వైఎస్​ఆర్ ఆరోగ్యశ్రీ పైలట్ ప్రాజెక్టు కింద పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో 2059 వ్యాధులకు చికిత్స అందించే కార్యక్రమాన్ని ప్రభుత్వం రూపొందించింది. పశ్చిమ గోదావరి జిల్లా మినహా మిగతా అన్ని జిల్లాల్లో 1259 రోగాలకు చికిత్స అందించేలా కార్యాచరణ చేపట్టింది. ఫిబ్రవరి నుంచి క్యాన్సర్ వ్యాధికి కూడా ఆరోగ్యశ్రీ కింద పూర్తి చికిత్స అందించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1.5 లక్షల కార్డుల ఆరోగ్య శ్రీ కార్డులను జారీ చేయనుంది.

అదనంగా 1000 వ్యాధులకు చికిత్స

దారిద్ర్యరేఖ దిగువనున్న కుటుంబాలకు వైద్య ఖర్చులు వెయ్యి దాటితే ఆరోగ్యశ్రీ పథకం వర్తింపచేసేలా ప్రభుత్వం ఈ పథకానికి రూపొందించింది. గతంలో కంటే అదనంగా వెయ్యి వ్యాధులను ఈ జాబితాలో చేర్చింది. పశ్చిమ గోదావరి జిల్లాలో అదనంగా చేర్చిన వెయ్యి వైద్య చికిత్సల్లో భాగంగా 780 వరకూ ఇన్ పేషెంట్ వైద్య చికిత్సలతో పాటు 170 ఒక్క రోజులో పూర్తి అయ్యే స్వల్పకాలిక చికిత్సలు, మరో 50 ఇతర స్వల్ప కాలిక చికిత్సలు ఉన్నాయి.

ఇదీ చదవండి :

ఆరోగ్యశ్రీ సేవలు విస్తరణ..పోస్టర్​ ఆవిష్కరించిన సీఎం

నేడు వైఎస్​ఆర్ ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ...ఏలూరులో సీఎం శ్రీకారం
వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకంలో భాగంగా లబ్ధిదారులకు కార్డుల పంపిణీని ప్రభుత్వం ఇవాళ్టి నుంచి ప్రారంభించనుంది. రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్డులను జారీ చేసే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో శ్రీకారం చుట్టునున్నారు. వైఎస్​ఆర్ ఆరోగ్యశ్రీ పైలట్ ప్రాజెక్టు కింద పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో 2059 వ్యాధులకు చికిత్స అందించే కార్యక్రమాన్ని ప్రభుత్వం రూపొందించింది. పశ్చిమ గోదావరి జిల్లా మినహా మిగతా అన్ని జిల్లాల్లో 1259 రోగాలకు చికిత్స అందించేలా కార్యాచరణ చేపట్టింది. ఫిబ్రవరి నుంచి క్యాన్సర్ వ్యాధికి కూడా ఆరోగ్యశ్రీ కింద పూర్తి చికిత్స అందించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1.5 లక్షల కార్డుల ఆరోగ్య శ్రీ కార్డులను జారీ చేయనుంది.

అదనంగా 1000 వ్యాధులకు చికిత్స

దారిద్ర్యరేఖ దిగువనున్న కుటుంబాలకు వైద్య ఖర్చులు వెయ్యి దాటితే ఆరోగ్యశ్రీ పథకం వర్తింపచేసేలా ప్రభుత్వం ఈ పథకానికి రూపొందించింది. గతంలో కంటే అదనంగా వెయ్యి వ్యాధులను ఈ జాబితాలో చేర్చింది. పశ్చిమ గోదావరి జిల్లాలో అదనంగా చేర్చిన వెయ్యి వైద్య చికిత్సల్లో భాగంగా 780 వరకూ ఇన్ పేషెంట్ వైద్య చికిత్సలతో పాటు 170 ఒక్క రోజులో పూర్తి అయ్యే స్వల్పకాలిక చికిత్సలు, మరో 50 ఇతర స్వల్ప కాలిక చికిత్సలు ఉన్నాయి.

ఇదీ చదవండి :

ఆరోగ్యశ్రీ సేవలు విస్తరణ..పోస్టర్​ ఆవిష్కరించిన సీఎం

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.