ETV Bharat / state

గొంతెండుతోంది.. దాహం తీర్చండి

ఓ వైపు ఎండలు మండుతుంటే.. మరోవైపు భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. చెరువులు ఎండిపోతున్నాయి. ఇదిలావుంటే ఓవర్​హెడ్​ ట్యాంక్​ ద్వారా రంగుమారే నీళ్లు సరఫరా చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఆ నీళ్ల సరఫరా ఆగిపోవటంతో పశ్చిమగోదావరి జిల్లా జట్లపాలెంలో గ్రామస్థులు ఆందోళనకు దిగారు.

author img

By

Published : May 25, 2019, 3:13 PM IST

'గొంతెండుతోంది.. మంచినీరు ఇవ్వండి'
'గొంతెండుతోంది.. మంచినీరు ఇవ్వండి'

పశ్చిమగోదావరి జిల్లా పెంటపాడు మండలం జట్లపాలెంలో తాగునీరు కోసం ప్రజలు అల్లాడిపోతున్నారు. నిప్పులకక్కే ఎండలకు ఊర్లో ఉన్న మూడు చెరువుల్లో నీరు ఎండిపోయాయి. ట్యాంకు నుంచి సరఫరా చేసే నీళ్ల రంగు మారిపోయింది. దీంతో ఆ గ్రామ ప్రజలు నీటి కోసం నానాపాట్లు పడుతున్నారు. నెలరోజులుగా ఆ నీటినే వాడుకుంటున్న ప్రజలు.. నేడు అవీ రాకపోవటంతో నిరసనకు దిగారు. పంచాయతీ కార్యాలయం ఎదుట ఖాళీ బిందెలతో ఆందోళన చేపట్టారు. చెరువులున్నా ఉపయోగం లేదనీ.. పంచాయతీ సరఫరా చేసే నీళ్లు బాగాలేవనీ.. పోనీ వాటితోనే ఎలాగో నెట్టుకొస్తున్నా.. ఇప్పుడు అవీ సరిగ్గా సరఫరా చేయడం లేదని గ్రామస్థులు వాపోతున్నారు. ఈ సమస్యపై అధికారులు వెంటనే స్పందించి తమ దాహం తీర్చాలని విజ్ఞప్తి చేశారు.

'గొంతెండుతోంది.. మంచినీరు ఇవ్వండి'

పశ్చిమగోదావరి జిల్లా పెంటపాడు మండలం జట్లపాలెంలో తాగునీరు కోసం ప్రజలు అల్లాడిపోతున్నారు. నిప్పులకక్కే ఎండలకు ఊర్లో ఉన్న మూడు చెరువుల్లో నీరు ఎండిపోయాయి. ట్యాంకు నుంచి సరఫరా చేసే నీళ్ల రంగు మారిపోయింది. దీంతో ఆ గ్రామ ప్రజలు నీటి కోసం నానాపాట్లు పడుతున్నారు. నెలరోజులుగా ఆ నీటినే వాడుకుంటున్న ప్రజలు.. నేడు అవీ రాకపోవటంతో నిరసనకు దిగారు. పంచాయతీ కార్యాలయం ఎదుట ఖాళీ బిందెలతో ఆందోళన చేపట్టారు. చెరువులున్నా ఉపయోగం లేదనీ.. పంచాయతీ సరఫరా చేసే నీళ్లు బాగాలేవనీ.. పోనీ వాటితోనే ఎలాగో నెట్టుకొస్తున్నా.. ఇప్పుడు అవీ సరిగ్గా సరఫరా చేయడం లేదని గ్రామస్థులు వాపోతున్నారు. ఈ సమస్యపై అధికారులు వెంటనే స్పందించి తమ దాహం తీర్చాలని విజ్ఞప్తి చేశారు.

ఇవీ చదవండి..

వైకాపా-తెదేపా వర్గాల ఘర్షణ.. కర్రలు, కత్తులతో దాడి

Intro:రానున్న విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు పాఠ్య పుస్తకాల పంపిణీ ప్రక్రియ చురుకుగా సాగుతోంది . జిల్లాలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అవసరమయ్యే 14 లక్షల 24 వేల 455 పాఠ్య పుస్తకాలు గాను ఇప్పటి వరకు 11, 09,792 పాఠ్య పుస్తకాలు జిల్లాకు చేరాయి. వీటిని రెండు విడతల్లో ఆర్టీసీ సహకారంతో మండల కేంద్రాలకు చేరవేస్తున్నారు. ఆర్టీసీకి చెందిన 2 వాహనాలను ఇందుకోసం వినియోగిస్తున్నారు. ప్రతిరోజు రెండు మూడు మండలాలకు ఆయా వాహనాల్లో ఎం ఆర్ సి లకు పంపిస్తున్నారు . వీటిని వచ్చే నెల 12 లోగా పాఠశాలలకు చేరవేసే చర్యలు సంబంధిత మండల విద్యాశాఖ అధికారులు చేపట్టారు. తొలివిడతగా ప్రస్తుతం తెలుగు మాధ్యమం పుస్తకాలు పంపిణీ చేస్తుండగా వారం రోజుల్లోగా రెండో విడత ఆంగ్ల మాధ్యమ పుస్తకాలు పంపిణీ చేయనున్నారు.

బైట్: విజయకుమారి, ఉప విద్యాశాఖాధికారి, శ్రీకాకుళం


Body:నరసన్నపేట


Conclusion:9440319788
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.