పాఠశాల విద్యార్థినులను లైంగికంగా వేధిస్తోన్న ఇద్దరు యువకులను పోక్సో చట్టం కింద అరెస్టు చేసిన ఘటన పశ్చిమగోదావరి జిల్లా ఉండ్రాజవరంలో జరిగింది. కాల్ధరి గ్రామానికి చెందిన ఇద్దరు బాలికలు వేలివెన్ను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్నారు. వీరిలో ఒకరిని గోపిరెడ్డి సత్యనారాయణ అనే యువకుడు, మరో బాలికను సంతోష్కుమార్ అనే యువకుడు లైంగికంగా వేధిస్తున్నారు. ఈ విషయాన్ని విద్యార్థినులు తమ తల్లిదండ్రులు చెప్పగా... వారు ఉండ్రాజవరం పోలీసులను ఆశ్రయించారు. నిందితులను రిమాండ్కు తరలించినట్టు ఉండ్రాజవరం ఎస్సై అవినాష్ తెలిపారు.
ఇదీ చదవండి :