ETV Bharat / state

పెరిగిన దాణా ధర.. కన్నీటి సంద్రంలో రైతులు

author img

By

Published : Mar 23, 2021, 2:59 PM IST

రోజుకొక గుడ్డు తింటే చాలు.. ఎటువంటి రోగాలు దరి చేరవంటారు వైద్యులు. ఎన్నో రకాల పోషకాల సమాహారంగా ఉంటూ.. ఆరోగ్య ఔషధంగా నిలుస్తోంది. కానీ ఆ గుడ్డును ఉత్పత్తి చేసే రైతులకు ప్రస్తుతం గడ్డుకాలం నడుస్తోంది. ఓ వైపు కరోనా కారణంగా పెరిగిన పన్నులు వేధిస్తుంటే.. మరో వైపు కోళ్ల దాణా ధరలు భీతిని కలిగిస్తున్నాయి. భవిష్యత్తుపై ఆశతో ప్రస్తుత రోజులను నెట్టుకురాక తప్పటం లేదని.. అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు.

losses of egg farming
పెరిగిన దాణా ధర.. కన్నీటి సంద్రంలో రైతులు

ఐదు దశాబ్దాల నుంచి వ్యవసాయ అనుబంధ రంగంగా పౌల్ట్రీ పరిశ్రమ ఎదుగుతూ వచ్చింది. అప్పటివరకు వ్యవసాయ అనుబంధ పరిశ్రమగా ఉన్న పాడి పరిశ్రమను పక్కకు నెట్టి.. పౌల్ట్రీ పరిశ్రమ ఆ స్థానాన్ని ఆక్రమించింది. మొదట్లో వేల కోళ్లతో ప్రారంభమైన పరిశ్రమ అనతికాలంలోనే లక్షల్లోకి చేరింది. ప్రస్తుతం ఉభయ గోదావరి జిల్లాల్లో 2 కోట్లకు పైగా కోళ్లతో పౌల్ట్రీ పరిశ్రమ నడుస్తోంది.

మిన్నంటిన దాణా ధరలు..

రెండేళ్లుగా పెరుగుతున్న దాణా ధరలు రైతులకు శాపంగా మారాయి. 2019లో మొక్కజొన్న, ఇతర ముడిసరుకుల ధరలు.. విపరీతంగా పెరగటంతో దాణా ధర టన్ను 24 వేల రూపాయలకు చేరింది. 2020లో కరోనా ప్రభావంతో ముడిసరుకుల ధరలు తగ్గిన కారణంగా.. దాణా ధర టన్ను 19 వేల రూపాయలకు దిగి వచ్చింది. ఈ మధ్య కాలంలో ధరలు పెరిగి టన్ను దాణా ధర 22 వేల రూపాయలకు చేరింది. దీంతో రైతులు బెంబేలెత్తిపోతున్నారు. ప్రస్తుతం కోడి గుడ్డు ధర కనీసం నాలుగు రూపాయలు ఉంటే తప్ప గిట్టుబాటు కాదని పౌల్ట్రీ రైతులు చెబుతున్నారు. కరోనా సమయంలో ప్రభుత్వం రెండు పర్యాయాలు 20 శాతం వంతున మొత్తం 40 శాతం అదనపు రుణాలు ఇవ్వటంతో పరిశ్రమను నిలుపుకోగలిగామన్నారు.

భయపెడుతున్న అధిక జీఎస్టీ

పౌల్ట్రీ రైతులు కొనుగోలు చేసే దాణా ముడి సరుకులు... ముఖ్యంగా సోయాబీన్, ఆయిల్ కేక్ వంటి వాటిపై ప్రభుత్వాలు విధిస్తున్న జీఎస్టీలు రైతులకు భారంగా మారుతున్నాయి. కోళ్ల సంఖ్య, వాటి దాణాను బట్టి.. గరిష్టంగా 20 వేల రూపాయల వరకు ప్రభుత్వానికి జీఎస్టీగా చెల్లిస్తున్నారు. నష్టాల్లో నడుస్తున్న పరిశ్రమకు ఇది మరింత భారంగా మారుతోందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పౌల్ట్రీ రైతుల పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని దాణా ముడిసరుకులపై విధించే జీఎస్టీ తొలగించాలని రైతులు కోరుతున్నారు.

ఇదీ చదవండి:

ఉరవకొండలో వైభవంగా చంద్రమౌళీశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు

ఐదు దశాబ్దాల నుంచి వ్యవసాయ అనుబంధ రంగంగా పౌల్ట్రీ పరిశ్రమ ఎదుగుతూ వచ్చింది. అప్పటివరకు వ్యవసాయ అనుబంధ పరిశ్రమగా ఉన్న పాడి పరిశ్రమను పక్కకు నెట్టి.. పౌల్ట్రీ పరిశ్రమ ఆ స్థానాన్ని ఆక్రమించింది. మొదట్లో వేల కోళ్లతో ప్రారంభమైన పరిశ్రమ అనతికాలంలోనే లక్షల్లోకి చేరింది. ప్రస్తుతం ఉభయ గోదావరి జిల్లాల్లో 2 కోట్లకు పైగా కోళ్లతో పౌల్ట్రీ పరిశ్రమ నడుస్తోంది.

మిన్నంటిన దాణా ధరలు..

రెండేళ్లుగా పెరుగుతున్న దాణా ధరలు రైతులకు శాపంగా మారాయి. 2019లో మొక్కజొన్న, ఇతర ముడిసరుకుల ధరలు.. విపరీతంగా పెరగటంతో దాణా ధర టన్ను 24 వేల రూపాయలకు చేరింది. 2020లో కరోనా ప్రభావంతో ముడిసరుకుల ధరలు తగ్గిన కారణంగా.. దాణా ధర టన్ను 19 వేల రూపాయలకు దిగి వచ్చింది. ఈ మధ్య కాలంలో ధరలు పెరిగి టన్ను దాణా ధర 22 వేల రూపాయలకు చేరింది. దీంతో రైతులు బెంబేలెత్తిపోతున్నారు. ప్రస్తుతం కోడి గుడ్డు ధర కనీసం నాలుగు రూపాయలు ఉంటే తప్ప గిట్టుబాటు కాదని పౌల్ట్రీ రైతులు చెబుతున్నారు. కరోనా సమయంలో ప్రభుత్వం రెండు పర్యాయాలు 20 శాతం వంతున మొత్తం 40 శాతం అదనపు రుణాలు ఇవ్వటంతో పరిశ్రమను నిలుపుకోగలిగామన్నారు.

భయపెడుతున్న అధిక జీఎస్టీ

పౌల్ట్రీ రైతులు కొనుగోలు చేసే దాణా ముడి సరుకులు... ముఖ్యంగా సోయాబీన్, ఆయిల్ కేక్ వంటి వాటిపై ప్రభుత్వాలు విధిస్తున్న జీఎస్టీలు రైతులకు భారంగా మారుతున్నాయి. కోళ్ల సంఖ్య, వాటి దాణాను బట్టి.. గరిష్టంగా 20 వేల రూపాయల వరకు ప్రభుత్వానికి జీఎస్టీగా చెల్లిస్తున్నారు. నష్టాల్లో నడుస్తున్న పరిశ్రమకు ఇది మరింత భారంగా మారుతోందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పౌల్ట్రీ రైతుల పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని దాణా ముడిసరుకులపై విధించే జీఎస్టీ తొలగించాలని రైతులు కోరుతున్నారు.

ఇదీ చదవండి:

ఉరవకొండలో వైభవంగా చంద్రమౌళీశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.