ETV Bharat / state

ఏలూరు చేపల మార్కెట్లో నిబంధనలు బేఖాతరు

author img

By

Published : Mar 29, 2020, 2:17 PM IST

పశ్చిమ గోదావరి జిల్లాలోని పలు చేపల మార్కెట్లలో ప్రజలు నిబంధనలు పాటించలేదు. జనం పెద్దఎత్తున మార్కెట్​కు వస్తున్నారు. సామాజిక దూరం పాటించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

rush at fish market in west godavari district
ఏలూరులో లాక్​డౌన్ పాటించని ప్రజలు
ఏలూరులో నిబంధనలు పాటించని ప్రజలు

పశ్చిమ గోదావరి జిల్లాలో చేపలు, మాంసం దుకాణాల వద్ద ప్రజలు నిబంధనలు పాటించడం లేదు. జనం భారీగా గుమిగూడి... చేపలు, మాంసం కొనుగోలు చేశారు. ప్రస్తుతం ఉన్న చేపల మార్కెట్లలో ఉదయం 6 నుంచి 9 గంటల వరకు విక్రయాలకు అనుమతి ఇచ్చారు. అక్కడ మాత్రం 9 దాటినా దుకాణాలు మూసివేయని కారణంగా.. ప్రజలు, దుకాణదారులపై పోలీసులు లాఠీ ఝళిపించారు. కూరగాయలు, నిత్యావసరాల దుకాణాల వద్ద సామాజిక దూరం పాటించేలా చర్యలు తీసుకున్నట్లుగా చేపల మార్కెట్ల వద్ద కూడా అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

ఏలూరులో నిబంధనలు పాటించని ప్రజలు

పశ్చిమ గోదావరి జిల్లాలో చేపలు, మాంసం దుకాణాల వద్ద ప్రజలు నిబంధనలు పాటించడం లేదు. జనం భారీగా గుమిగూడి... చేపలు, మాంసం కొనుగోలు చేశారు. ప్రస్తుతం ఉన్న చేపల మార్కెట్లలో ఉదయం 6 నుంచి 9 గంటల వరకు విక్రయాలకు అనుమతి ఇచ్చారు. అక్కడ మాత్రం 9 దాటినా దుకాణాలు మూసివేయని కారణంగా.. ప్రజలు, దుకాణదారులపై పోలీసులు లాఠీ ఝళిపించారు. కూరగాయలు, నిత్యావసరాల దుకాణాల వద్ద సామాజిక దూరం పాటించేలా చర్యలు తీసుకున్నట్లుగా చేపల మార్కెట్ల వద్ద కూడా అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

ఇదీ చదవండి:

'ఉచిత సరఫరాకు ఏర్పాట్లు పూర్తి: జేసీ'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.