ETV Bharat / state

భూమి విషయంలో తగాదా... గ్రామంలో ఉద్రిక్తత

author img

By

Published : Apr 29, 2020, 11:53 PM IST

పశ్చిమగోదావరి జిల్లా అల్లంచర్లలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ప్రభుత్వ భూమిలో నిర్మించుకున్న ఇంటిని కూల్చివేయడంతో గ్రామంలో ఘర్షణ వాతావరణం తలెత్తింది. అధికార పార్టీకి చెందిన ఓ వ్యక్తే తమ ఇంటిని పడగొట్టాడని బాధితులు ఆరోపించారు.

Quarrel over land  in allamcharla village west godavari district
టి.నర్సాపురం పోలీస్ స్టేషన్

పశ్చిమగోదావరి జిల్లా టీ.నరసాపురం మండలం అల్లంచర్ల గ్రామంలో ఉన్న సర్వే నెం.26లోని సుమారు 126 ఎకరాల అటవీ భూమిని పదేళ్ల కిందట కొందరు ఆక్రమించి సాగు చేస్తున్నారు. ఈ విషయంపై గ్రామంలో ఘర్షణలు జరుగుతున్నాయి. అధికార పార్టీకి చెందిన ఓ వ్యక్తి ఈ భూమిని ఆక్రమించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారని తెదేపా నేతలు ఆరోపిస్తున్నారు. ఇటీవల ఓ వ్యక్తి ఈ భూమిలో రేకుల షెడ్ నిర్మించుకున్నారు. విషయం తెలుసుకున్న సదరు వ్యక్తి రాత్రి సమయంలో వెళ్లి ఆ ఇంటిని కూల్చివేశారని బాధితులు వాపోతున్నారు. ఈ విషయంపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశామని తెలిపారు.

పశ్చిమగోదావరి జిల్లా టీ.నరసాపురం మండలం అల్లంచర్ల గ్రామంలో ఉన్న సర్వే నెం.26లోని సుమారు 126 ఎకరాల అటవీ భూమిని పదేళ్ల కిందట కొందరు ఆక్రమించి సాగు చేస్తున్నారు. ఈ విషయంపై గ్రామంలో ఘర్షణలు జరుగుతున్నాయి. అధికార పార్టీకి చెందిన ఓ వ్యక్తి ఈ భూమిని ఆక్రమించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారని తెదేపా నేతలు ఆరోపిస్తున్నారు. ఇటీవల ఓ వ్యక్తి ఈ భూమిలో రేకుల షెడ్ నిర్మించుకున్నారు. విషయం తెలుసుకున్న సదరు వ్యక్తి రాత్రి సమయంలో వెళ్లి ఆ ఇంటిని కూల్చివేశారని బాధితులు వాపోతున్నారు. ఈ విషయంపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశామని తెలిపారు.

ఇదీచదవండి.

4 వేల లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేసిన పోలీసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.