పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ప్రాంతానికి చెందిన గర్భిణీ పురిటి నొప్పులతో తణుకులోని జిల్లా కేంద్ర ఆస్పత్రిలో చేరారు. అత్యవసర పరిస్థితుల్లో ఆమెకు సిజేరియన్ చేశారు. అంతకు ముందే ఆమె కొవిడ్ నిర్ధరణ పరీక్షల కోసం శాంపిల్ పంపారు. తర్వాత వచ్చిన ఫలితాల్లో పాజిటివ్గా తేలింది. శస్త్ర చికిత్స చేసిన ముగ్గురు వైద్యులను తొమ్మిది మంది నర్సింగ్ సహాయ సిబ్బందిని హోం క్వారంటైన్కు తరలించారు.
ఇదీ చదవండి: నటి రేఖ సెక్యూరిటీ సిబ్బందికి కరోనా.. బంగ్లా మూసివేత